Saturday, 25 March 2023

దీపం,Dipam

 

దీపం


 


దీపంవెలిగించనిదే యేదైవారధన జరుగదు. అసలు దీపమే సర్వదేవత స్వరూపమని హిందువుల విశ్వాసం. దీపప్రమిద క్రిందిభాగం బ్రహ్మ, మధ్య భాగం విష్ణువు, ప్రమిద శివుడు, వత్తులవెలుగు సరస్వతి, మండేభాగం (విస్ఫులింగం) లక్ష్మియని పడితులు వివరిస్తున్నారు.  విద్యుద్దీపాలు లేని పూర్వకాలంలో అసలు దీపాలే వెలుగుకు ఆధారమన్న విషయం అందరెరిగినదే. చీకటి అజ్ఞానానికి సంకేతం. వెలుగు జ్ఞానానికి ప్రతీక. కనుకనే దీపం జ్ఞానదాయినయింది. దీపం తొలిమలిసంధ్యల్లో వెలిగించి దైవరధనచేయటమొక సదాచారం. కనీసం మలిసంధ్యలోనైనా దీపరధనచేయటం శ్రేయస్కరం. దీపం పంచభూతత్మకమని కొందరి అభిప్రాయం. మట్టిప్రమిద భూతత్వానికి, తైలం జలతత్వానికి, వత్తులు ఆకాశతత్వానికి, వెలగడానికి ప్రసరించేగాలి వాయుతత్వానికి. జ్యోతి అగ్నితత్వానికి ప్రతీకలు. విశ్వం కాంతిమయం. కాంతిశక్తిమయం. దైవాన్ని ప్రకాశంగా ఆరాధించే సంప్రదాయన్ని ఋషులు అనుష్టించారు. పూజను పారంభించడానికిముందు దైవానికి ప్రతిరూపమైన దీపాన్నివెలిగిస్తూ "దీపం జ్యోతి పరబ్రహ్మం. దీపం సర్వతమోపహం. దీపేన హరతే పాపం. దీపలక్ష్మీ నమోస్తుతే" అని శ్లోకం చెబుతూ దీపాన్నివెలిగించి ఇష్టదేవతాపూజలు యధావిధిగా కొనసాగించాలి. ఆలయంలోదీపం, వృక్షమూలంవద్ద దీపం. ఆలయధ్వజస్తంభంవద్ద దీపం, గృహంలోని దేవునిమూల దీపం, ఇంటిగుమ్మంవద్ద దీపం, తులసికోటవద్ద దీపం ముగ్గులమధ్య దీపం, పుష్పాలమధ్య దీపం,  ఇలా ఎక్కడ దీపంవెలిగించినా అసురశక్తులను, అసురగుణాలను నిలువరించి సత్వాన్నీ, సత్యాన్నీ ప్రతిష్టిస్తూ దీపశిఖవలె ఊర్ద్వముఖంగా భగవంతునివైపు మనస్సును మరల్చుతుంది. దీపంకొసనుండి వచ్చే మంటచుట్టూ ఒక కాంతివలయం ఏర్పడుతుంది. అది శక్తివంతమైన దైవానికి ప్రతిరూపం. సమస్త దోషాలను పరిహరించి వరుస విజయాయాల నివ్వగల శక్తిఅది. దీపాలను నేరుగా                                            

అగ్గిపుల్లతో వెలిగించరాదంటారు. ముందుగ ఒకదీపాన్ని అగ్గిపుల్లతో వెలిగించి. ఆదీపంతోమిగిలిన దీపాలన్నీ వెలిగించి, అగ్గిపుల్లతో వెలిగించిన దీపాన్ని ఆర్పేయవచ్చు. దీపాలను ఆర్పేయాల్సివస్తే, నోటితో ఊదరాదు. ప్రమిదలో ముందుగా నూనెపోసినతర్వాతే వత్తులు వేయాలి. నేయివేసిన ప్రమిదలోగానీ దీపస్తంభంలోగానీ ఐదు వత్తులు కలిపివేసుకొని స్త్రీలు వెలిగిస్తే ,మొదటివత్తి వలన భర్త, రెండవవత్తివలన అత్తామామలు, మూడవవత్తివలన తోబుట్టువులు క్షేమంగవుంటారు, నల్గవది గౌరవ మర్యాదలు హెచ్చిస్తుంది. ధర్మవర్తనాన్ని ప్రోత్సహిస్తుంది. ఐదవవత్తివలన వంశాభివృద్ధి జరుగుతుంది. ఎప్పుడుకూడా ఒకవత్తిదీపం వెలిగించరాదు. ఆవునెయ్యిలో నువ్వులనూనె, వేపనూనె కలిపి వెలిగిస్తే విశేష ఫలితాలుంటాయంటారు. పైవాటిలో ఏదోఒకదానితో దీపం వెలిగించవచ్చు. ఆముదం. కానుగనూనె కొబ్బరినూనెతో కూడా దీపాలు వెలిగించుకోవచ్చును. కానుగనూనెదీపాలు కంటికి చలువచేస్తాయి. ప్రమిదక్రింద మరొకప్రమిదగానీ తమలపాకుగాని, బియ్యంగానీపోసి దీపంపెట్టుకోవాలి. దిపాస్తంభానికైతే  క్రింద బియ్యంపోయడం  ఉత్తమం .

ఒకసారి ఐరావతంపై వెళుతున్న ఇంద్రునికి దూర్వాసమునీంద్రుడు పారిజాతసుమమాలను ఇచ్చాడు. ఇంద్రుడు నిర్లక్ష్యంగా మాలను ఐరవతంపై వేశాడు. ఆఏనుగు క్రిందవేసి కాలితోత్రొక్కి నలిపేసింది. దుర్వాసముని కోపించి ఇంద్రుని శపించాడు. అంతటితో ఇంద్రుడు సర్వంకోల్పోయాడు. దిక్కుతోచక ఇంద్రుడు శ్రీహరిని శరణుజొచ్చాడు. శ్రీహరి దీపరూపంలో లక్ష్మినిపూజింపమన్నాడు. ఇంద్రుడు శ్రీహరి చెప్పినట్లుచేసి, పూర్వవైభవాన్ని తిరిగిపొందాడు. దీపం దేవుని ఎదురుగాపెట్టరాదు. శివునిపూజలో ఎడమవైపు, శ్రీహరిపూజలో కుడివైపు పెట్టుకోవాలి. శనిదోషం పొవాలంటే, అరచేతిలో నల్లని వస్త్రంపెట్టుకొని అందులో నల్లనువ్వులు కొన్ని పోసిచుట్టి నువ్వులనూనె లోతడిపి నువ్వులనూనెదీపం పెడితే ,శనిదేవుడుకూడా అనుకూలఫలితాలనిస్తాడు. కార్తీకమాసం శివకేశవులకిద్దరికి ఇష్టమైనమాసం. ఈనెలలో దీపాలతో వారిని పూజిస్తే తెలియకజేసినపాపాలు హరించుకపోతాయి. కృత్తికా నక్షత్రంతో కూడిన కార్తీకమాసదినం దీపారాధనకు మరింత శ్రేష్ఠమైనది. కర్తీకపౌర్ణమినాడు 365 వత్తుల దీపారధనచేస్తే, ఏడాదిపొడవునా దీపారాధనచేసిన పుణ్యం లభిస్తుంది. కార్తీకమాసంలో ఆలయాల్లో ఆకాశదీపాలు వెలిగిస్తారు. చిన్నచిన్న రంధ్రాలుగలిగిన ఇత్తడిపాత్రలో నూనెపోసి దీపాలు వెలిగించి తాడుసహాయంతో ధ్వజస్తంభం పైకి పంపి వ్రేలాడదీస్తారు. ఈదీపాలు పితృదేవతలు మనలను దీవించి వెళ్ళేటప్పుడు వారికి దారిచూపిస్తాయని పండితుల అభిప్రయం. మార్గశిరపాడ్యమినాడు అరటిదొప్పలలో దీపాలువెలిగించి, పోలిఅనే ఒకభక్తురాలు ఉత్తమలోకాలకు పోతున్నట్లు భావించి నీటిలో వదులుతారు. ఈపోలి మహాభక్తురాలు. ఈమెను కార్తీకమాసంలో దీపారాధన చేయనీయకుండా, అత్తాతోడికోడళ్ళు, పూజవస్తువులు ఇంట్లోవుంచకుండా తవెంటతీసుకొని నదీస్నానానికి వెళ్ళేవారు. పోలి ఉపాయంగా పెరటిలోని ప్రత్తిచెట్టునుండి దూది సేకరించుకొని వత్తులుచేసుకొని, కవ్వానికంటుకొనివున్న వెన్నతీసి, వత్తులకు పట్టించి దీపారాధన సక్రమంగాచేసుకొని, అత్తా తోడికోడళ్ళు తిరిగివచ్చేసరికి ఒకబుట్టక్రింద దీపాలను దాచేసేదట. ఈమె భక్తికిమెచ్చి దేవతలు విమానంలో వచ్చి ఆమెనెక్కించుకొని ఉత్తమలోకాలకు బయలుదేరారు, వెంటనే అత్తాతోడికోడళ్ళు వచ్చి, ముందు అత్త పోలికాలు పట్టుకొని వ్రేలాడిందట, ఆమెకాలు కాలుపట్టుకొని మొడటికోడలు, ఆకోడలుకాలుపట్టుకొని రెండవకోడలు, అకోడలుకాలుపట్టుకొని మూడవకోడలు వ్రేలాడసాగారట. అప్పుడు అదిగమనించి దేవతలు అత్తను అనర్హురాలని క్రిందకుతోసేశారు. ఆమెతోపాటి వ్రేలాడుతున్న ఆమె కోడాళ్ళూ క్రిందపడిపోయరు. పోలినిమాత్రమే విమానంలో ఆకాశ గమనాన పరంథామానికి కొనిపోయారు దేవతలు. ఇదీ పోలిపాడ్యమికథ. ఈమార్గశిర పాడ్యమినాడు అరటిదొన్నెలలో దీపాలు వెలిగించి నీటిలో వదిలితే, తామూ పోలివలె పుణ్యలోకాలకు వెళతామని. బ్రతికినన్నాళ్ళు పసుపూకుంకుమలో సుమంగళిగా గౌరవంగా జీవిస్తామని నమ్ముతారు. దీపావళినాడు ఇంటింటా దీపాలవరుసలు దర్శనమిస్తాయి. నరకాసుర వధతో దూర్తపాలన అంతమంది, ప్రజలజీవితాలలో వెలుగులు నిండాయన్న శుభసంకేతంగా అమావాస్యచీకటి కనరాకుండా ఆనాడు దీపాలుపెట్టి ఆనందిస్తారు. ఇదీ దీపమహాత్మ్యం.  

 

 

No comments:

Post a Comment

పారాణి

  పారాణి పసుపులో సున్నపునీరు చిక్కగాకలుపుకుంటే పారాణి తయారౌతుంది. అదేనీళ్ళగా కలుపుకుంట...