Tuesday, 24 December 2024

పారాణి

 

పారాణి


పసుపులో సున్నపునీరు చిక్కగాకలుపుకుంటే పారాణి తయారౌతుంది. అదేనీళ్ళగా కలుపుకుంటే వసంతమౌతుంది. దేవతల ఊరేగింపు చరమాంకంలో వసంతాలు చల్లుకుంటారు. హోలీపండుగలో పిచికారీల్లో వసంతంనింపుకొని చల్లుకొని ఆనందిస్తారు. దిష్టితీయడానికికూడా వసంతం ఉపయోగపడుతుంది. పారాణి ముఖ్యంగా పాదాలకు అందమైనడీజైన్లలో పట్టించుకుంటారు. వివాహాలలో వధూవరుల కిరువురికీ కాళ్ళకు పరాణిపట్టించి ఎఱ్ఱగా అందంగ వుండేట్లు అలంకరిస్తారు. అరచేతులకు వేళ్ళకుగూడా పట్టించి కొద్దిసేపటితర్వత కడిగేసుకుంటే చాలాఅందంగా వుంటాయి. ఆ దంపతులకు యింకా పారాణికూడా ఆరలేదంటే, వారు నవదంపతులని, క్రొత్తగా పెండ్లైనవారని అర్థం. పారణి ప్రకృతిసిద్ధమైంది కబట్టి మనిషికి హానిచెయ్యదు. ప్రస్తుతం వస్తున్న రంగులపారాణివల్ల హానికలుగవచ్చు. కనుక పసుపు సున్నం కలిపిచేసిన పారణి వడుకొని శుభకార్యాలు జరుపుకోవడం యెంతో శ్రేయస్కరం. పారాణి మంగళద్రవ్యం. స్త్రీ ఐదోతనానికి చిహ్నం కూడా. ప్రత్యేకంగా వ్రతాలు, పూజలు చేసుకొనేప్పుడు తాముపారాణిని ధరించడమేగాకుండా, యింటిలోని ఆడవారు వచ్చిన ముత్తైదువుల పాదాలకుగూడా పారాణిపూసి గౌరవిస్తారు.

పసుపు క్రిమినాశిని. పసుపుతోపాటూ సున్నంకూడా పారాణిలో వుంటుందిగనుక. ఇది తీవ్రమైన క్రిమిసంహరకం. ఘాటుగావుంటుంది గనుక పారాణిముద్దను గోరుచుట్టు, పిప్పిగోళపైపట్టించడంవల్ల యీగోళ్ళవ్యాధులు నయమౌతాయి.

మరింత ఎఱ్ఱగా అందంగా అలంకరించుకోవడానికి రెడిమేడ్ పారాణిపాకెట్లు మార్కెట్లో యిప్పుదు దొరుకుతున్నాయి. అంతేగాకుండా ఇంట్లోనే రెండుమూడు రకాలుగా పారాణిని తయారుచేసుకుంటారుకూడా. మేలైన కుంకుమలో నిమ్మరసం కలిపి చిక్కనిద్రవంగా చేసుకొని, ఇయర్‌బడ్ సహాయంతో వివిధడిజైన్‌లలో పారణిగా పాదాలపైన, అరచేతులపైనా వేసుకుంటారు. ఇంకోరకమైన పారాణి యిలా చేసుకుంటారు. ఒకమెటల్‌పాత్రమధ్యలో ప్రమిద బోర్లించిపెట్టి ప్రమిదచుట్టూ టెంకాయచిప్ప చిన్నచిన్న తుంటలుగానీ లేదా బెల్లంపొడిగానీ పెట్టి ఒకచిన్న ఖాలీస్టీల్‌గ్లాసును, ముందు బోర్లించిపెట్టిన ప్రమిదపై పెట్టాలి. తర్వాత ముందుగాపెట్టిన పాత్రవంటి మరోపాత్రను మొదటిపాత్రపై పెట్టి తడిపిపెట్టికున్న మైదాతోగానీ బంకమట్టితో గానీ రెండుపాత్రల మధ్యనుండి గాలిపోకుండా సీల్చేయాలి. తర్వాత పాత్రలోని వస్తువులు కదలని విధంగా జాగ్రత్తగా పొయ్యి మీదపెట్టి పైపాత్రలో చల్లనినీరుపోసి పొయ్యివెలిగించి మంటపెట్టాలి. పైనపెట్టిన పాత్రలోని నీరు బాగా మరిగేవరకు మంటపెట్టి, తర్వాత పాత్రలు చల్లబడేవరకువుండి, పాత్రలసీల్ తొలగించి పైపాత్రను తొలగించిచూస్తే స్టీల్‌గ్లాసులో ఒకరకమైన ద్రవం వుంటుంది. ఆద్రవాన్ని కొద్దిగాతీసుకొని అందులో మంచికుంకుమ వేసి చిక్కగా కలుపుకొని పారాణిగా వాడుకొనవచ్చును. దీనివల్లకూడా యేహానీ వుండదు.

Monday, 23 December 2024

పట్టీలు

 పట్టీలు (Anklets)



బాలికలు పట్టీలతో తిరుగాడుతుంటే లక్ష్మీదేవి ఇంట్లో నడయాడుతున్నట్లుంటుందని హిందువుల భావన. అందుకే పుట్టిన ఆరునెలలకే బిడ్డకు పట్టీలువేసి మురిసిపోతుంటారు. పడతుల పట్టీల చిరుగజ్జల సవ్వడికి పరవశించి కవులు కవితలు, పాటలు అల్లారు. పారాణిపాదాల అందం రజితమువ్వలపట్టీలు ద్విగుణీకృతంచేసి పెండ్లికొడుకులు తలలు వంచేట్లు చేస్తాయనడం అతిశయోక్తికాదు. జ్యోతిష్యం ప్రకారం వెండి చంద్రునికి ప్రతీక. శుక్రునితో సంబంధం కలిగివుంటుంది. వెండిపట్టీలు భూమినుండి శక్తినిగ్రహించి శరీరానికందిస్తాయి. వెండిపట్టీలు శ్రేయస్సుకు చిహ్నం. పట్టీలచిరుమువ్వల సవ్వడివలన గృహంలోనికి సకారాత్మక శక్తులు ప్రవేశించి శుభా లందిస్తాయి. పట్టీలు ముఖ్యంగా వెండితోనే చేయించుకుంటారు. శరీరం పైభాగాన బంగారునగలు, క్రిందిభాగాన వెండినగలు ధరిస్తారు. బంగారం పసుపురంగు, గనుక అది లక్ష్మికి ప్రతీక. కాళ్ళకు బంగారు ధరించటం లక్ష్మీదేవిని అవమానించినట్లౌతుందని పట్టిలు బంగారంతోగాక వెండితోనే చేయించుకుంటారు.

స్త్రీలకు వెండిపట్టీలు ఆరోగ్యపరంగా యెంతో మేలుచేస్తాయి. వెండి శరీరాన్ని చల్లబరుస్తుంది. ఉష్ణోగ్రతను సమస్థితిలో వుంచుతుంది. రోగనిరోధకశక్తిని పెంచుతుంది. ఎముకల దృఢత్వం పెంచుతుంది. సరైన ఆహారపు అలవాట్లు కొరవడటంవలన స్త్రీలలో హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటున్నది. ఈవెండిపట్టీలు అట్టి హార్మోన్ల సమతుల్యతకు దోహదపడతాయి. మానసిక ప్రశాంతతనిస్తాయి. ఋతుసమయంలొవచ్చే పొత్తికడుపునొప్పి, నడుంనొప్పి, చీకాకు, నీరసం యీవెండి పట్టీలవల్ల తగ్గిపోతాయి. గర్భాశయం ఆరోగ్యంగావుంటుంది. సంతానం కలగటానికి సహాయపడతాయి. ప్రసవనొప్పులను తగ్గిస్తాయి. పాదాల, మడమనొప్పులు వాపులు తగ్గుతాయి. రక్తప్రసరణ క్రమబద్దమౌతుంది. సూక్ష్మక్రిములు, వైరస్ వల్లకలిగే జలుబు, దగ్గువంటి రోగాలురావు. గాయాలు త్వరగా మానిపొతాయి.

అనారోగ్యలక్షణాలను గుర్తించడానికి వెండిపట్టీలు తోడ్పడతాయి. చెమటలు యెక్కువై, శరీరంలో గధకంపాళ్ళు పెరిగి ఆరోగ్యం దెబ్బతింటే, పట్టీలు నల్లబడతాయి. పట్టీలు చర్మానికి తగిలియున్నచోట చర్మం నీలిరంగులోనికి మరితే, సోడియంపాళ్ళు శరీరంలో యెక్కువైనవని గ్రహించి ఉప్పువాడకం తగ్గించుకొనవచ్చును. అంతేగకుండా స్త్రీలు యెక్కువసేపు నిలబడి పనులు చేస్తూవుంటారు. అటువంటివారికి వచ్చే కీళ్ళనొప్పులుకూడా యీవెండి పట్టీలవల్ల ఉపశమనం కలుగుతుంది.

పూర్వం స్త్రీపురుషులుకూడా కళ్ళకు వెండికడియాలు ధరించేవారు. అవి మొరటైపోయి స్త్రీలుమాత్రం పట్టీలు వేసుకొంటున్నారు. సిటీలలో అవీపోయి యిప్పుడు పట్టీలుగా అమరివుండే చెప్పులువచ్చేశాయి. వటిని ఫ్యాషన్‌గా ధరిస్తున్నారు. ఏమైనా వెండిపట్టీలు చాలామేలుచేస్తాయని తెలిస్తే తప్పక వేసుకుంటారని ఆశిద్దాం.

                           

పారాణి

  పారాణి పసుపులో సున్నపునీరు చిక్కగాకలుపుకుంటే పారాణి తయారౌతుంది. అదేనీళ్ళగా కలుపుకుంట...