Monday, 9 December 2024

మకరతోరణం

 

మకరతోరణం

గర్భగుడిలోని యేదేవతా విగ్రహానికైనా వెనుక మకరణం వుండితీరుతుంది. ఈమకరతోరణానికి సంబంధించి ఒక పురాణగాథ వున్నది. అదేమిటో ముందుగా తెలుసుకుందాం--

 కీర్తిముఖుడనే రాక్షసుడు బ్రహ్మనుగూర్చి ఘోరమైన తపమాచరించాడు. బ్రహ్మప్రత్యక్షమై అతడుకోరినట్లు మరణంలేని జీవనాన్ని ప్రసాదించాడు. కీర్తిముఖుడు వరగర్వంతో సమస్తజీవరాసులను యెదిరించి, త్రిభువనాలలోని సంపదనంతా తనవశంచేసుకున్నాడు. దేవతలు నారదునిపంపి అతడు పార్వతీదేవిని అపహరిచేటట్లు ప్రోత్సహించారు. తద్వారా శివుడు ఆగ్రహించి కీర్తిముఖుని దండిస్తాడని వారి ఆశ. వరగవ్వితుడైన కీర్తిముఖుడు దేవతలనుకునట్లే నారదుని బోధతో పార్వతీదేవిని అపహరింపబోయాడు. శివుడు ఆగ్రహించి భయంకరమైన అగ్నిని వాడిపైకి వదిలాడు. తనపైకి దూసుకవస్తున్న మంటలకు భయపడి, పరమేశ్వరుని కాళ్ళపైబడి శరణమన్నాడు. భోళాశంకరుడు దయదలచి అగ్నిని తనమూడవకన్నుగా ధరించి కీర్తిముఖుని గాపాడినాడు. కీర్తిముఖునికి అమితమైన ఆకలివేసింది. శివదేవుని ఆహారంకోసం ప్రార్థించాడు. శివుడు నీశరీరాన్నే తినేయమన్నాడు. కీర్తిముఖుడు మకరరూపం ధరించి, తోకభాగంనుండి తననుతాను తినడం మొదలుబెట్టి శరీరభాగంమొత్తం తినేశాడు. ఇంకా ఆకలి ఆకలిఅంటూ శివునిముందు నోరుతెరిచాడు కీర్తిముఖుడు. నేటినుండి నీవు దేవిదేవతలకు తోరణమై పైభాగమున నీతల‍అమరి పూజింపవచ్చిన భక్తుల దుష్టవికారాలను, అహంకారాన్ని, దురాశను భక్షింస్తూవుండు. నీకూ భక్తులపూజలు లభిస్తాయని వరమిచ్చాడు. ఆ కీర్తిముఖుడే శివవరప్రసాదంగా మకరతోరణమై పైభాగమున రాక్షసముఖంతో మిటకరించిన కనిగుడ్లతో భయంకరంగ కనిపిస్తున్నాడు. ఈకథకు ఆధారం స్కందపురాణంలో వుంది.

 

 మరొక కథనం ప్రకారం శివుడు కౄరుడైన ఒకరాక్షసుని సంహరించడంకోసం తనతలనుండి ఒకజటనుపెరికి నేలపైకొట్టాడు. ఆజట ఒకభయంకర సింహశిరస్సుగల రాక్షసుని వెంబడించింది. రాక్షసుడు భయకంపితుడై శివదేవుని వేడుకున్నాడు. దయదలచి శివుడు ఆరాక్షసునికి అభయమిచ్చాడు. కానీ శివుడు సృష్టించిన ఆ భయంకరమృగం, నాకు ఆహరంకావలసిన రాక్షసుని మీరే తినొద్దంటే, నాఆకలి తీ రేదెట్లా? అని దేవదేవుని ప్రశ్నించింది. నీవు నీశారీరన్నే తినేయమని శివుడు ఆజ్ఞాపించాడు. అప్పుడామృగం తనతోకభాగంనుండి తననుతానే తినేసింది. తలమాత్రమే మిగిలింది. శివుడు ఆమృగశిరస్సును ఆశ్వీదరించి కీర్తిముఖమనిపేరిడి, తనఆలయముఖద్వారముపై స్థిరమగా నుండుమని వరమిచ్చాడు. అదే యిపుడు దేవతామూర్తుల మకరతోరణాగ్రమున నిలచి సింహతలాటమనుపేరున పూజలందుకొనుచున్నది.

 



   ఈ మకరతోరణం తలకట్టులేని గ () ఆకారంలో  బంగారు, వెండి, రాగి, లేక  యిత్తడితో తయారుచేస్తారు. దీనిపై లతలు, దేవీదేవతల‍అస్త్రాలు, జంతువులముఖాలవంటివి చిత్రిస్తారు. పైభాగంలో భయంకర సింహంతలరూపం (కిర్తిముఖం) చిత్రిస్తారు. ఈవిధంగా మకరతోరణం గూడా మూలవిరట్టుతో పాటు పూజలందుకొని పూజించినవారి దుర్గుణాలను హరించుచున్నది.  

No comments:

Post a Comment

పారాణి

  పారాణి పసుపులో సున్నపునీరు చిక్కగాకలుపుకుంటే పారాణి తయారౌతుంది. అదేనీళ్ళగా కలుపుకుంట...