Showing posts with label mango leaves. Show all posts
Showing posts with label mango leaves. Show all posts

Saturday, 25 March 2023

మామిడాకులు,mango leaves

 

మామిడాకులు



మామిడాకుల తోరణాలు కట్టనిదే హిందువుల యే శుభకార్యమూ జరగదు. పండుగల్లో, వ్రతాల్లో, యాజ్ఞయాగాదుల్లో, ఆలయద్వజారోహణల్లో, వివాహాదిశుభకార్యాల్లో, పందిళ్ళకు, మంటపాలకు, తలవాకిళ్ళకు మామిడితోరణాలు కట్టవలసిందే. కలశంలో కూడా మామిడాకులుంచడం సర్వసామాన్యం. మామిడాకుల్లో లక్ష్మీదేవి కొలువుంటుందని మనవారి నమ్మకం. అందుకే మామిడాకుల మంగళతోరణాలు కట్టిన ఇంట్లోగానీ మంటపాల్లోగానీ లక్ష్మీదేవిఅనుగ్రహం మెండుగా వుంటుంది. మామిడాకుల ప్రస్తావన భారత రామాయణాల్లోకూడావుంది క్రీ.పూ 150 సంవత్సరాల నాడే సాంచీస్తూపంపై ఫలించిన మామిడి వృక్షం చెక్కబడింది. ఉగాది పచ్చడిలో మామిడికాయముక్కలు తప్పనిసరి. మామిడిచెట్టు భక్తి ప్రేమలకు ప్రతీక. ఈచెట్టు సృష్టికర్త బ్రహ్మకు సమర్పింబడినదని, దీని పువ్వులు చంద్రునికి సమర్పింపబడ్డాయని హైందవవిశ్వాసం. కాళిదాసు దీన్ని మన్మథుని బాణాల్లో ఒకటిగా వర్ణించారు. శివపార్వతుల వివాహం ఒక ఇతిహాసానుసారం మామిడిచెట్టు క్రిందేజరిగింది. హనుమంతునివల్ల మామిడి భారతావనిలో వ్యాప్తిజెందిందని పండితులు చెబుతున్నారు. హనుమ మామిడి సువాసనకు ఆకర్షితుడై మామిడి ఫలాలను భుజించి, ముట్టెలను సముద్రంలో విసిరేశాడట, అవి బారతభూభాగానికి కొట్టుకవచ్చి చెట్ట్లుమొలిచి వ్యాపించాయట. మామిడాకులు కట్టినయింటికి వాస్తుదోషం తగలదు. సకారాత్మకశక్తుల ప్రవేశం, నకారాత్మకశక్తుల తిరోగమనం జరిగితిరుతుందంటారు.  కనుక పట్టిందల్ల బంగారమౌతుంది. మామిడాకులు తోరణం కట్టినచోట మనస్సుకు ప్రశాంతత జేకూరుతుంది. ఆప్రదేశంలో ప్రాణవాయువుశాతం పెరిగి స్వచ్ఛత నెలకొంటుంది. ప్రతిదీ శుభప్రదమౌతుంది. రోగకారక సూక్ష్మజీవులు నశించించడంవల్ల ఆరోగ్య పరిరక్షన జరుగుతుంది. మామిడాకులు యేకారణంచేతనైనా దొరక్కపోతే రాగి, జివ్వి, మర్రి ఆకులతో తోరణాలు కట్టూకోవచ్చు. మామిది, జివ్వి, రాగి, మర్రి, ఉత్తరేణి ఆకులను పంచపల్లవాలంటారు. వీటన్నిటినీ హిందువులు పవిత్రంగా భావిస్తారు. పూర్వకాలంలో పెళ్ళికిముందు వరుడు మామిడిచెట్టుకు పసుపుకుంకుమలతో పూజించి ప్రదక్షిణచేసి చెట్టును కౌగలించుకొని తర్వాత పెళ్ళిమంటపం ప్రవేసించే వాడట.

 ఆయుర్వేదంలోను, చైనావైద్యవిధానంలోనూ మామిడాకులు ఉపయోగపడుతున్నాయి. లేతమామిడాకులను నీడలో రెండబెట్టి చూర్ణం చేసుకొని రోజూ ఒకచంచా సేవించవచ్చు. లేదా ఆకులను సాంయంత్రం కషాయంకాచుకొని మరునాడు ఉదయం వడగట్టి త్రాగవచ్చు. అది రక్తంలో చెక్కెరను అదుపుచేస్తుంది. మూత్రపిండాలలోని రాళ్ళు కరిగిపోతాయి. రక్తనాళాలు బలాన్నిపుంజుకొని రక్తపోటు అదుపులో వుంటుంది. ఈకషాయంతో గాయాలుకడిగితే తొందరగా మానిపోతాయి. చెవిలోవేస్తే చెవిపోటు తగ్గుతుంది. కేరళలో ఆకులబూడిదతో పళ్ళపొడి తయారు చేస్తున్నారు.  మామిడిచెట్టుబెరడు వేళ్లుకూడా ఆయుర్వేదం మరియు చైనా వైద్యవిధానంలో ఉపయోగిస్తుంన్నారు. ఊబకాయం, గుండెసమస్యలు, క్యాన్సర్‍వంటిరోగాలకు, కణుతులు, అజీర్ణం, నిద్రలేమి, మతిమరుపు, వణుకుడు, క్రొవ్వుపేరుకపోవడం, గర్భాశయవ్యాధులు, పోస్ట్రేటుగ్రంధి వాపు, కడుపులో పూతలకు మందులు తయరౌతున్నాయి. జుత్తుసంరక్షక ఔషదాల్లోనూ, తైలాల్లోనూ మామిడాకుల రసాన్ని వాడుతున్నారు. లేతమామిడిఆకుల్లో విటమిన్ ఎ, బి, సి, రాగి, పొటాషియం, మెగ్నీషీయం, మరియు జీర్ణశక్తిని మెరుగుపరిచే ఎంజైములు ఉన్నాయి.కనుక పచ్చిచిగుళ్ళు నమిలి మ్రింగినా మంచిదే నంటున్నారు .అందువల్ల నోటిదుర్వాసన కూడా తగ్గుతుంది. మామిదాకులు నీళ్ళతో పేస్టుగానూరి కాస్తాతేనెకలిపి ముఖానికి మాస్కుగా వాడితే ముఖం కాంతివంత మౌతుంది. తేనెకలపని పేస్టును వెంట్రుకలకు (తలకు) పట్టించి ఓ 15 నిముషాల తర్వాత తలస్నానంచేస్తే జుత్తు బాగపెరిరుగుతుంది, వెంట్రుకలు రాలవు, తెల్లబడవు. ఎండిన మమిడాకులు కాల్చి ఆపొగ పీలిస్తే గొంతు సంబంధవ్యాధులు నయమౌతాయి. ఇలా మామిడాకులు చాలా ప్రతిభావంతములై వున్నవి.                      

 

పారాణి

  పారాణి పసుపులో సున్నపునీరు చిక్కగాకలుపుకుంటే పారాణి తయారౌతుంది. అదేనీళ్ళగా కలుపుకుంట...