Showing posts with label Jilledu. Show all posts
Showing posts with label Jilledu. Show all posts

Tuesday, 2 May 2023

జిల్లేడు (అర్క)

 

జిల్లేడు (అర్క)



జిల్లేడు ఒక పాలుగలమొక్క. పూలరంగునుబట్టి యీ చెట్టు మూడు రకాలు. తెల్లజిల్లేడు, ఎఱ్ఱజిల్లేడు, రాజుజిల్లేడు. సుమారు రెండుమూడు మీటర్లవరకు యీచెట్టు పెరుగుతుంది. దూదివంటినూగు చెట్టంతా కప్పబడి వుంటుంది. ఆకులు దళసరిగా వుంటాయి. పండియెండిన దీనికాయలనుండి తెల్లని మృదువైన దూదివుంటుంది. ఆశియాదేశాలన్నిటిలో జిల్లేడు లభిస్తుంది.

హిందూమతవ్యవస్థలో జిల్లేడుకు ప్రత్యేకస్థానమున్నది. వినాయకచవితి పర్వదినాన, గణపతివ్రతకల్పవిధానంలో జిల్లేడుఆకులతో గణపతిని ముఖ్యంగా పూజిస్తారు. రథసప్తమినాడు యీ ఆకులు తలపై ధరించి నదీస్నానంచేస్తే గొప్పపుణ్యమని నమ్ముతారు. తెల్లజిల్లేడుదూది వత్తులతో ఇప్పనూనెదీపాలు ఐదింటిని ఐదువారాలపాటు వెలిగిస్తే హనుమంతుని అనుగ్రహం కలుగుతుందని విశ్వసిస్తారు. అంతేగాక తెల్లజిల్లేడుపూలతో శివపూజ, ఆకులతో సూర్య(అర్క)పూజచేస్తే శుభప్రదమని భావిస్తారు. తెల్లజిల్లేడును ఇంట్లో పెంచుకుంటే గణపతి ఇంట్లో వున్నట్లేనని పండితులు చెబుతారు. అష్టైశ్వర్యాలు కలుగుతాయని, యీతిబాధలు తొలగిపోతాయని, వ్యాపారాభివృద్ధి జరుగుతుందని, విద్యార్థులు రాణిస్తారనీ,  సర్వకార్యాయూలు  జయప్రదంగా నెరవేరుతాయనినీ  పెద్దలుసూచించారు. పుష్యమీనక్షత్ర ఆదివారంగానీ, గురువారంగానీ "పుషార్కయోగం" ఆరోజున తెల్లజిల్లేడుచెట్టును నాటి పూజచేయడం శ్రేయస్కరంమని పండితులు సెలవిచ్చారు.  పూజకు ఎఱ్ఱమందారంపూలు, ఎఱ్ఱచందనం శేష్ఠం.  కొన్ని తెల్లజిల్లేడువేళ్ళు గణపతి ఆకారంలో వుంటాయి. ఇటువంటివి కాణిపాకం వినాయకాలయం చెంత అమ్ముతుండుటం గమనించవచ్చు. ఇవి పూజకు ఉత్తమమని పూజారులు సెలవిస్తున్నారు. జిల్లేడుచెట్లు విరివిగాగల  గ్రామాల్లో పంటలు బాగాపండుతాయని ప్రతీతి. ఈచెట్లు పాడుబడినయిళ్ళలో ఎక్కువగా మొలవడంవల్ల,  మీయింట్లో "జిల్లేళ్ళుబడ" అని శపిస్తుంటారు. అంతేగానీ జిల్లేడు అపశకునానికి కారణం కానేకాదు.

జిల్లేడు ఆయుర్వేదమూలికలలో ముఖ్యమైనది. జిల్లేడుపాలను పసుపులోకలిపి ముఖానికిరాసుకుంటే, ముఖవర్ఛస్సు పెరుగుతుంది. లేతచిగుళ్ళు తాటిబెల్లంతో కలిపినూరి కుంకుడుగిజప్రమాణం నాలుగు రోజులు రెండుపూటలా సేవిస్తే స్త్రీల ముట్టుకుట్టునొప్పి తగ్గుతుంది. జిల్లేడుపాలు దూదితో తడిపి పాముకరిచినచోట లేక తేలుకుట్టినచోట పెడితే విషం తలకెక్కదు. విషం దికివస్తుంది. దీన్ని ప్రధమచికిత్సగా చేయవచ్చును. ఆకులరసం తేనెతోకలిపి త్రాగితే, జ్వరాలు తగ్గుతాయి . ఎండినతెల్లజిల్లేడుపొడి 15 గ్రాములు,100 గ్రాముల బెల్లం, 10 గ్రాముల వామ్ముకలిపినూరి 5 గ్రాములంత మాత్రలు చేసుకొని, 40 రోజులు ఆవుపాలు లేక మంచినీటితో రోజుకోమాత్ర చొప్పున వాడితే మొండిఉబ్బసమైనా బాగౌతుంది. కీళ్ళనొప్పులకు, ఆకులకు ఆముదం పట్టించి, వెచ్చజేసి కడితే తగ్గుతాయి. ఎండినఆకులపొడి పాలతోసేవిస్తే, కడుపులో పుండ్లు మానుతాయి. ఆకులరసం విరేచనమవ్వడానికి, మలబద్ధకం పోవడానికి వాడుకోవచ్చు. దీనిపాలు నువ్వులనూనెతో కలిపి నూనెమిగిలేట్లు కాచుకొని అర్కక్షీరతైలం తయారుచేసుకోవచ్చు. ఇది నరాలబలహీనతకూ, చర్మవ్యాధుల నివారణకూ మర్ధన చేస్తారు. ఆవనూనెపట్టించి వేడిచేసినఆకులు నొప్పి వాపు వున్నచోట వేసికడితే ఉపశమనం కలుగుతుంది. జిల్లేడువేరుకాల్చిన బొగ్గుతో పళ్ళుతోముకుంటే దంతసమస్యలు రావు. ఆకులకు నువ్వునూనెగానీ ఆముదంగానీ పట్టించి, కాస్తాఉప్పు వేసినూరి పలుచటిగుడ్డలోవుంచి, రెండు మూడు చుక్కలు చెవిలోపడేట్లు పిండితే చెవిపోటు తగ్గిపోతుంది. ఆకులు అరికాళ్ళకు అంటించి సాక్సువేసుకొని రోజంతా లేక రాత్రంతా వుంచుకుంటే రక్తంలో చెక్కెర తగ్గుతుంది. జిల్లేడుపాలు కంట్లోపడితే చూపుపోతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. గనుక జాగ్రత్తగా వుండాలి. హోమియోవైద్యంలోకూడా జిల్లేడుతో Calotropis Gigantea అనేమందు తయారుచేస్తున్నారు. ఇది ఉబ్బసం, దగ్గు, కుష్ఠు, బొల్లి, కీళ్ళనొప్పులకు మందుగా వాడుతున్నారు.                                                                 

పారాణి

  పారాణి పసుపులో సున్నపునీరు చిక్కగాకలుపుకుంటే పారాణి తయారౌతుంది. అదేనీళ్ళగా కలుపుకుంట...