Saturday, 25 March 2023

దీపం,Dipam

 

దీపం


 


దీపంవెలిగించనిదే యేదైవారధన జరుగదు. అసలు దీపమే సర్వదేవత స్వరూపమని హిందువుల విశ్వాసం. దీపప్రమిద క్రిందిభాగం బ్రహ్మ, మధ్య భాగం విష్ణువు, ప్రమిద శివుడు, వత్తులవెలుగు సరస్వతి, మండేభాగం (విస్ఫులింగం) లక్ష్మియని పడితులు వివరిస్తున్నారు.  విద్యుద్దీపాలు లేని పూర్వకాలంలో అసలు దీపాలే వెలుగుకు ఆధారమన్న విషయం అందరెరిగినదే. చీకటి అజ్ఞానానికి సంకేతం. వెలుగు జ్ఞానానికి ప్రతీక. కనుకనే దీపం జ్ఞానదాయినయింది. దీపం తొలిమలిసంధ్యల్లో వెలిగించి దైవరధనచేయటమొక సదాచారం. కనీసం మలిసంధ్యలోనైనా దీపరధనచేయటం శ్రేయస్కరం. దీపం పంచభూతత్మకమని కొందరి అభిప్రాయం. మట్టిప్రమిద భూతత్వానికి, తైలం జలతత్వానికి, వత్తులు ఆకాశతత్వానికి, వెలగడానికి ప్రసరించేగాలి వాయుతత్వానికి. జ్యోతి అగ్నితత్వానికి ప్రతీకలు. విశ్వం కాంతిమయం. కాంతిశక్తిమయం. దైవాన్ని ప్రకాశంగా ఆరాధించే సంప్రదాయన్ని ఋషులు అనుష్టించారు. పూజను పారంభించడానికిముందు దైవానికి ప్రతిరూపమైన దీపాన్నివెలిగిస్తూ "దీపం జ్యోతి పరబ్రహ్మం. దీపం సర్వతమోపహం. దీపేన హరతే పాపం. దీపలక్ష్మీ నమోస్తుతే" అని శ్లోకం చెబుతూ దీపాన్నివెలిగించి ఇష్టదేవతాపూజలు యధావిధిగా కొనసాగించాలి. ఆలయంలోదీపం, వృక్షమూలంవద్ద దీపం. ఆలయధ్వజస్తంభంవద్ద దీపం, గృహంలోని దేవునిమూల దీపం, ఇంటిగుమ్మంవద్ద దీపం, తులసికోటవద్ద దీపం ముగ్గులమధ్య దీపం, పుష్పాలమధ్య దీపం,  ఇలా ఎక్కడ దీపంవెలిగించినా అసురశక్తులను, అసురగుణాలను నిలువరించి సత్వాన్నీ, సత్యాన్నీ ప్రతిష్టిస్తూ దీపశిఖవలె ఊర్ద్వముఖంగా భగవంతునివైపు మనస్సును మరల్చుతుంది. దీపంకొసనుండి వచ్చే మంటచుట్టూ ఒక కాంతివలయం ఏర్పడుతుంది. అది శక్తివంతమైన దైవానికి ప్రతిరూపం. సమస్త దోషాలను పరిహరించి వరుస విజయాయాల నివ్వగల శక్తిఅది. దీపాలను నేరుగా                                            

అగ్గిపుల్లతో వెలిగించరాదంటారు. ముందుగ ఒకదీపాన్ని అగ్గిపుల్లతో వెలిగించి. ఆదీపంతోమిగిలిన దీపాలన్నీ వెలిగించి, అగ్గిపుల్లతో వెలిగించిన దీపాన్ని ఆర్పేయవచ్చు. దీపాలను ఆర్పేయాల్సివస్తే, నోటితో ఊదరాదు. ప్రమిదలో ముందుగా నూనెపోసినతర్వాతే వత్తులు వేయాలి. నేయివేసిన ప్రమిదలోగానీ దీపస్తంభంలోగానీ ఐదు వత్తులు కలిపివేసుకొని స్త్రీలు వెలిగిస్తే ,మొదటివత్తి వలన భర్త, రెండవవత్తివలన అత్తామామలు, మూడవవత్తివలన తోబుట్టువులు క్షేమంగవుంటారు, నల్గవది గౌరవ మర్యాదలు హెచ్చిస్తుంది. ధర్మవర్తనాన్ని ప్రోత్సహిస్తుంది. ఐదవవత్తివలన వంశాభివృద్ధి జరుగుతుంది. ఎప్పుడుకూడా ఒకవత్తిదీపం వెలిగించరాదు. ఆవునెయ్యిలో నువ్వులనూనె, వేపనూనె కలిపి వెలిగిస్తే విశేష ఫలితాలుంటాయంటారు. పైవాటిలో ఏదోఒకదానితో దీపం వెలిగించవచ్చు. ఆముదం. కానుగనూనె కొబ్బరినూనెతో కూడా దీపాలు వెలిగించుకోవచ్చును. కానుగనూనెదీపాలు కంటికి చలువచేస్తాయి. ప్రమిదక్రింద మరొకప్రమిదగానీ తమలపాకుగాని, బియ్యంగానీపోసి దీపంపెట్టుకోవాలి. దిపాస్తంభానికైతే  క్రింద బియ్యంపోయడం  ఉత్తమం .

ఒకసారి ఐరావతంపై వెళుతున్న ఇంద్రునికి దూర్వాసమునీంద్రుడు పారిజాతసుమమాలను ఇచ్చాడు. ఇంద్రుడు నిర్లక్ష్యంగా మాలను ఐరవతంపై వేశాడు. ఆఏనుగు క్రిందవేసి కాలితోత్రొక్కి నలిపేసింది. దుర్వాసముని కోపించి ఇంద్రుని శపించాడు. అంతటితో ఇంద్రుడు సర్వంకోల్పోయాడు. దిక్కుతోచక ఇంద్రుడు శ్రీహరిని శరణుజొచ్చాడు. శ్రీహరి దీపరూపంలో లక్ష్మినిపూజింపమన్నాడు. ఇంద్రుడు శ్రీహరి చెప్పినట్లుచేసి, పూర్వవైభవాన్ని తిరిగిపొందాడు. దీపం దేవుని ఎదురుగాపెట్టరాదు. శివునిపూజలో ఎడమవైపు, శ్రీహరిపూజలో కుడివైపు పెట్టుకోవాలి. శనిదోషం పొవాలంటే, అరచేతిలో నల్లని వస్త్రంపెట్టుకొని అందులో నల్లనువ్వులు కొన్ని పోసిచుట్టి నువ్వులనూనె లోతడిపి నువ్వులనూనెదీపం పెడితే ,శనిదేవుడుకూడా అనుకూలఫలితాలనిస్తాడు. కార్తీకమాసం శివకేశవులకిద్దరికి ఇష్టమైనమాసం. ఈనెలలో దీపాలతో వారిని పూజిస్తే తెలియకజేసినపాపాలు హరించుకపోతాయి. కృత్తికా నక్షత్రంతో కూడిన కార్తీకమాసదినం దీపారాధనకు మరింత శ్రేష్ఠమైనది. కర్తీకపౌర్ణమినాడు 365 వత్తుల దీపారధనచేస్తే, ఏడాదిపొడవునా దీపారాధనచేసిన పుణ్యం లభిస్తుంది. కార్తీకమాసంలో ఆలయాల్లో ఆకాశదీపాలు వెలిగిస్తారు. చిన్నచిన్న రంధ్రాలుగలిగిన ఇత్తడిపాత్రలో నూనెపోసి దీపాలు వెలిగించి తాడుసహాయంతో ధ్వజస్తంభం పైకి పంపి వ్రేలాడదీస్తారు. ఈదీపాలు పితృదేవతలు మనలను దీవించి వెళ్ళేటప్పుడు వారికి దారిచూపిస్తాయని పండితుల అభిప్రయం. మార్గశిరపాడ్యమినాడు అరటిదొప్పలలో దీపాలువెలిగించి, పోలిఅనే ఒకభక్తురాలు ఉత్తమలోకాలకు పోతున్నట్లు భావించి నీటిలో వదులుతారు. ఈపోలి మహాభక్తురాలు. ఈమెను కార్తీకమాసంలో దీపారాధన చేయనీయకుండా, అత్తాతోడికోడళ్ళు, పూజవస్తువులు ఇంట్లోవుంచకుండా తవెంటతీసుకొని నదీస్నానానికి వెళ్ళేవారు. పోలి ఉపాయంగా పెరటిలోని ప్రత్తిచెట్టునుండి దూది సేకరించుకొని వత్తులుచేసుకొని, కవ్వానికంటుకొనివున్న వెన్నతీసి, వత్తులకు పట్టించి దీపారాధన సక్రమంగాచేసుకొని, అత్తా తోడికోడళ్ళు తిరిగివచ్చేసరికి ఒకబుట్టక్రింద దీపాలను దాచేసేదట. ఈమె భక్తికిమెచ్చి దేవతలు విమానంలో వచ్చి ఆమెనెక్కించుకొని ఉత్తమలోకాలకు బయలుదేరారు, వెంటనే అత్తాతోడికోడళ్ళు వచ్చి, ముందు అత్త పోలికాలు పట్టుకొని వ్రేలాడిందట, ఆమెకాలు కాలుపట్టుకొని మొడటికోడలు, ఆకోడలుకాలుపట్టుకొని రెండవకోడలు, అకోడలుకాలుపట్టుకొని మూడవకోడలు వ్రేలాడసాగారట. అప్పుడు అదిగమనించి దేవతలు అత్తను అనర్హురాలని క్రిందకుతోసేశారు. ఆమెతోపాటి వ్రేలాడుతున్న ఆమె కోడాళ్ళూ క్రిందపడిపోయరు. పోలినిమాత్రమే విమానంలో ఆకాశ గమనాన పరంథామానికి కొనిపోయారు దేవతలు. ఇదీ పోలిపాడ్యమికథ. ఈమార్గశిర పాడ్యమినాడు అరటిదొన్నెలలో దీపాలు వెలిగించి నీటిలో వదిలితే, తామూ పోలివలె పుణ్యలోకాలకు వెళతామని. బ్రతికినన్నాళ్ళు పసుపూకుంకుమలో సుమంగళిగా గౌరవంగా జీవిస్తామని నమ్ముతారు. దీపావళినాడు ఇంటింటా దీపాలవరుసలు దర్శనమిస్తాయి. నరకాసుర వధతో దూర్తపాలన అంతమంది, ప్రజలజీవితాలలో వెలుగులు నిండాయన్న శుభసంకేతంగా అమావాస్యచీకటి కనరాకుండా ఆనాడు దీపాలుపెట్టి ఆనందిస్తారు. ఇదీ దీపమహాత్మ్యం.  

 

 

మామిడాకులు,mango leaves

 

మామిడాకులు



మామిడాకుల తోరణాలు కట్టనిదే హిందువుల యే శుభకార్యమూ జరగదు. పండుగల్లో, వ్రతాల్లో, యాజ్ఞయాగాదుల్లో, ఆలయద్వజారోహణల్లో, వివాహాదిశుభకార్యాల్లో, పందిళ్ళకు, మంటపాలకు, తలవాకిళ్ళకు మామిడితోరణాలు కట్టవలసిందే. కలశంలో కూడా మామిడాకులుంచడం సర్వసామాన్యం. మామిడాకుల్లో లక్ష్మీదేవి కొలువుంటుందని మనవారి నమ్మకం. అందుకే మామిడాకుల మంగళతోరణాలు కట్టిన ఇంట్లోగానీ మంటపాల్లోగానీ లక్ష్మీదేవిఅనుగ్రహం మెండుగా వుంటుంది. మామిడాకుల ప్రస్తావన భారత రామాయణాల్లోకూడావుంది క్రీ.పూ 150 సంవత్సరాల నాడే సాంచీస్తూపంపై ఫలించిన మామిడి వృక్షం చెక్కబడింది. ఉగాది పచ్చడిలో మామిడికాయముక్కలు తప్పనిసరి. మామిడిచెట్టు భక్తి ప్రేమలకు ప్రతీక. ఈచెట్టు సృష్టికర్త బ్రహ్మకు సమర్పింబడినదని, దీని పువ్వులు చంద్రునికి సమర్పింపబడ్డాయని హైందవవిశ్వాసం. కాళిదాసు దీన్ని మన్మథుని బాణాల్లో ఒకటిగా వర్ణించారు. శివపార్వతుల వివాహం ఒక ఇతిహాసానుసారం మామిడిచెట్టు క్రిందేజరిగింది. హనుమంతునివల్ల మామిడి భారతావనిలో వ్యాప్తిజెందిందని పండితులు చెబుతున్నారు. హనుమ మామిడి సువాసనకు ఆకర్షితుడై మామిడి ఫలాలను భుజించి, ముట్టెలను సముద్రంలో విసిరేశాడట, అవి బారతభూభాగానికి కొట్టుకవచ్చి చెట్ట్లుమొలిచి వ్యాపించాయట. మామిడాకులు కట్టినయింటికి వాస్తుదోషం తగలదు. సకారాత్మకశక్తుల ప్రవేశం, నకారాత్మకశక్తుల తిరోగమనం జరిగితిరుతుందంటారు.  కనుక పట్టిందల్ల బంగారమౌతుంది. మామిడాకులు తోరణం కట్టినచోట మనస్సుకు ప్రశాంతత జేకూరుతుంది. ఆప్రదేశంలో ప్రాణవాయువుశాతం పెరిగి స్వచ్ఛత నెలకొంటుంది. ప్రతిదీ శుభప్రదమౌతుంది. రోగకారక సూక్ష్మజీవులు నశించించడంవల్ల ఆరోగ్య పరిరక్షన జరుగుతుంది. మామిడాకులు యేకారణంచేతనైనా దొరక్కపోతే రాగి, జివ్వి, మర్రి ఆకులతో తోరణాలు కట్టూకోవచ్చు. మామిది, జివ్వి, రాగి, మర్రి, ఉత్తరేణి ఆకులను పంచపల్లవాలంటారు. వీటన్నిటినీ హిందువులు పవిత్రంగా భావిస్తారు. పూర్వకాలంలో పెళ్ళికిముందు వరుడు మామిడిచెట్టుకు పసుపుకుంకుమలతో పూజించి ప్రదక్షిణచేసి చెట్టును కౌగలించుకొని తర్వాత పెళ్ళిమంటపం ప్రవేసించే వాడట.

 ఆయుర్వేదంలోను, చైనావైద్యవిధానంలోనూ మామిడాకులు ఉపయోగపడుతున్నాయి. లేతమామిడాకులను నీడలో రెండబెట్టి చూర్ణం చేసుకొని రోజూ ఒకచంచా సేవించవచ్చు. లేదా ఆకులను సాంయంత్రం కషాయంకాచుకొని మరునాడు ఉదయం వడగట్టి త్రాగవచ్చు. అది రక్తంలో చెక్కెరను అదుపుచేస్తుంది. మూత్రపిండాలలోని రాళ్ళు కరిగిపోతాయి. రక్తనాళాలు బలాన్నిపుంజుకొని రక్తపోటు అదుపులో వుంటుంది. ఈకషాయంతో గాయాలుకడిగితే తొందరగా మానిపోతాయి. చెవిలోవేస్తే చెవిపోటు తగ్గుతుంది. కేరళలో ఆకులబూడిదతో పళ్ళపొడి తయారు చేస్తున్నారు.  మామిడిచెట్టుబెరడు వేళ్లుకూడా ఆయుర్వేదం మరియు చైనా వైద్యవిధానంలో ఉపయోగిస్తుంన్నారు. ఊబకాయం, గుండెసమస్యలు, క్యాన్సర్‍వంటిరోగాలకు, కణుతులు, అజీర్ణం, నిద్రలేమి, మతిమరుపు, వణుకుడు, క్రొవ్వుపేరుకపోవడం, గర్భాశయవ్యాధులు, పోస్ట్రేటుగ్రంధి వాపు, కడుపులో పూతలకు మందులు తయరౌతున్నాయి. జుత్తుసంరక్షక ఔషదాల్లోనూ, తైలాల్లోనూ మామిడాకుల రసాన్ని వాడుతున్నారు. లేతమామిడిఆకుల్లో విటమిన్ ఎ, బి, సి, రాగి, పొటాషియం, మెగ్నీషీయం, మరియు జీర్ణశక్తిని మెరుగుపరిచే ఎంజైములు ఉన్నాయి.కనుక పచ్చిచిగుళ్ళు నమిలి మ్రింగినా మంచిదే నంటున్నారు .అందువల్ల నోటిదుర్వాసన కూడా తగ్గుతుంది. మామిదాకులు నీళ్ళతో పేస్టుగానూరి కాస్తాతేనెకలిపి ముఖానికి మాస్కుగా వాడితే ముఖం కాంతివంత మౌతుంది. తేనెకలపని పేస్టును వెంట్రుకలకు (తలకు) పట్టించి ఓ 15 నిముషాల తర్వాత తలస్నానంచేస్తే జుత్తు బాగపెరిరుగుతుంది, వెంట్రుకలు రాలవు, తెల్లబడవు. ఎండిన మమిడాకులు కాల్చి ఆపొగ పీలిస్తే గొంతు సంబంధవ్యాధులు నయమౌతాయి. ఇలా మామిడాకులు చాలా ప్రతిభావంతములై వున్నవి.                      

 

Wednesday, 22 March 2023

సాంబ్రాణి,Benzoin

 


సాంబ్రాణి



సాంబ్రాణిచెట్టునుండి వచ్చే జిగురు (బంక) నుండి సాంబ్రాణి తయారౌతుంది. దీన్ని నిప్పులపై వేస్తే తెల్లటి సువాసనగలపొగ వస్తుంది. దైవం ముందు సాంబ్రాణి పొగవేయడం హిందువుల ఆచారం. ముస్లింలు, క్రైస్తవులు కూడా దీన్ని పవిత్రంగా భావిస్తారు. ముస్లింఫకీర్లు నిప్పులపళ్ళెరాన్ని పట్టుకొని తిరుగుతూ యీపొగను వేసి నెమలీకలకట్టతో పొగ మనవైపుకు త్రిప్పి, దీవిస్తారు. క్రీస్తుజననం సమయంలో తూర్పుదేశపు జ్ఞానులు ఆయనను సమీపించి ఇచ్చిన కానుకలలో సాంబ్రాణికూడా వుంది. రోమన్‍క్యాథలిక్  తెగవారు ప్రార్థనాలయాల్లో (చర్చీల్లో) సాంబ్రాణిని వాడటం యిప్పటికి జరుగుచున్నది. దర్గాలలోకుడా ముస్లింలు సాంబ్రాణిపొగవేయడం చేస్తున్నారు. దైవకైంకర్యంగా సాంబ్రాణిపొగలు వేయడం దాదాపు అన్ని మతాలవారు ఇష్టంగా చేస్తున్నారు. సొమాలియా, అరేబియా, ఓమన్, ఇండోనేషీయా, జోర్డాన్, ఆఫ్రికా, భారత్ లలో యీసాంబ్రాని చెట్లనుపెంచి, విరివిగా వ్యాపారంకూడా చేస్తున్నారు. దేవునిపూజకేగాకుండా చనిపోయిన వారికికూడా సాంబ్రాణిధూపం వేస్తారు. వ్యక్తిచనిపోయినతర్వాత 12 రోలుజులవరకు ఇంట్లోసాంబ్రాణి ధూపం వేస్తారు. దివసాలలో, తద్దినాలలో, ముఖ్యంగా మహాలయ అమావాస్యనాడు, సాంబ్రాణిధూపంవేసి పరమపదించిన తమపూర్వీకులను తలచుకుంటారు. సాంబ్రాణిపొగలు తమపితృదేవుళ్ళను చేరి, వారిదీవనలు మనకందేట్లు చేస్తుంని విశ్వసిస్తారు. దీనియందు నమ్మకమున్నా లేకపోయినా సాంబ్రాణిపొగలు ఇల్లంతా అలముకొని, సువాసనను వెదజల్లడమేగాకుండా, సూక్ష్మక్రిములను, దోమలను, కీటకాలను పారద్రోలుతాయి. దుష్టశక్తులను అడ్డుకొని నకారాత్మక శక్తులను పారదోలి సకారాత్మక శక్తులను ఇంట్లోకి ఆహ్వానిస్తాయన్నది పురోహితుల ఆభిప్రాయం. జ్యోతిషశాస్త్రజ్ఞులు సాంబ్రాణిధూపం యేరోజు వేస్తే యేఫలితం సమకూరుతుందో యిలా వివరించారు. ఆదివారం సాంబ్రాణి గుగ్గిలం కలిపినిప్పులపై పొగవేయడంద్వార సిరిసంపదలు, కీర్తి, దైవానుగ్రహం కలుగుతుంది. అదే సోమవారమైతే ఆరోగ్యం, ప్రశాంతత, దేవీకటాక్షం కలుగుతాయి. మంగళవారమైతే శత్రుభయం, అసూయ, ఈర్షా తొలగిపోయి, కంటిసమస్యలు, అప్పులబాధ వైదొలగుతాయి. బుధవారమైతే నమ్మకద్రోహులు, కుట్రదారులనుండి వచ్చే ఆపదలను పరిహరించి, వరుసగా శుభాలు కలుగుతాయి. పెద్దల ఆశీస్సులు ఫలిస్తాయి. గురువారమైతే సర్వకార్యములలో విజయం లభిస్తుంది. శుక్రవారమైతే లక్ష్మీప్రసన్నతతో నిర్విఘ్నంగా అనుకున్న కార్యాలు నెరవేరుతాయి. అదే శనివారమైతే ఈతిబాధలు తొలగిపోతాయి. శనీశ్వరుని అనుగ్రహం లభించి, సోమరితనం, అలసత్వం వదలిపోయి, తేజస్వంతులై వెలుగొందుతారు.

 ప్రస్తుతం సాంబ్రణికడ్డీలు, దిమ్మెలు విరివిగా లభిస్తున్నాయి. పూర్వం  ఆవుపేడతో చేసుకొన్న పిడకకు నిప్పంటించి దానిపై సాంబ్రాణి, గుగ్గిలం, శుద్ధచందనం కలిపివుంచుకొన్న పొడిని వేసిపొగను ఇల్లంతా వ్యాపింపజేసుకొనేవారు. కానీ యిప్పుడు కొన్నిరసాయనాలు కలిపిచేసిన సాంబ్రాణిదిమ్మెలు, బత్తీలు వస్తున్నాయి. వీటిపొగ మంచిదికాదని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు.  కనుక బాగాపరిశీలించి కొనాలి. శుద్ధ సాంబ్రాణిపొగ పీల్చడంవల్ల శ్వాససంబంధిత వ్యాధులు నయమౌతాయి. తలస్నానానంతరం శిరోజాలకు సాంబ్రాణి పొగవేసుకుంటే త్వరగా తల ఆరిపోవడమేగాకుండా, వెంట్రుకల కుదుళ్ళు బలపడతాయి. చంటిబిడ్డలకు యిలాచేస్తే రోగాలు దరిచేరవు. మంచినిద్రపడుతుంది. పిల్లలు చలాకీగావుంటారు. జుత్తు ఒత్తుగావున్న స్త్రీలకు తలస్నానానంతరం సాంబ్రాణిపొగపట్టడం సర్వదా స్రేయస్కరం.

 సాంబ్రాణి వైద్యపరంగానూ చాల ఉపయోగకారి. శరీరంలోని నీరసాన్ని పోగొట్టి నరాలను ఉత్తేజపరుస్తుంది. అనేక మానసికరుగ్మతలకు సాంబ్రాణిధూపం మంచిఔషదం. కీళ్ళనొప్పులకు అజీర్తికి చర్మవ్యాధులకు ఉబ్బసం అల్సర్ వ్యాధుల మందుల్లో సాంబ్రాణిని వాడుతారు. సాంబ్రణిపొగలు నాడీమండల వ్యవస్థను ప్రేరేపించి క్రమబద్దీకరిస్తాయి. సాంబ్రాణినుండి నూనెనుకూడా తీస్తారు. ఈనూనె సబ్బులు, బాడీలోషన్‍లు, పర్ఫ్యూమ్‍సు టూత్‍పేస్టులలో మరియు నొప్పినివారణ ఆయిట్‍మెంట్లలో వాడుతున్నారు.

  గుగ్గిలం, మైసాక్షి కూడా సాంబ్రణితో కలిపిగానీ వేరుగగానీ పొగవెయ్యడానికి ఉపయోగిస్తారు. ఇవికూడా వాటి చెట్లజిగురు నుండే తయారుచేస్తారు. మైసాక్షి (మహిషాక్షి) గుగ్గిలంలో మేలైన రకం.  ఇవికూడా ధూపానికేగాక ఆయుర్వేదమందుల్లో విరివిగా వాడుతారు. గుగ్గిలంతో తయారుచేసే యోగరాజగుగ్గులు అనే మాత్రలు ఆయుర్వేదంలో చాలా పసిద్ధిపొందాయి. ఇవి కీళ్ళనొప్పులను. వాతపునొప్పులను నయంచేస్తాయి. సాంబ్రాణిధూపం అనుదినం దైవంముందు వేద్దాం, ఇల్లంతా పొగలు వ్యాపింపజేద్దాం ఆనందంగా హుషారుగా వుందాం.         

 

 

 

 

 

 

 

 

 

 

 

Tuesday, 21 March 2023

కర్పూరం,camphor

 

కర్పూరం



కర్పూరాన్ని  కపురం, కప్పురం అనికూడాఅంటారు. కర్పూరంచెట్లు చైనా, జపాన్, దేశాల్లోను, భారత్‍లోని నీలగిరికొండల్లోనూ, మైసూర్, మలబార్ ప్రాంతాలలోనూ ఎక్కువగా  పెంచుతున్నారు.  హారతికర్పూరం, పచ్చకర్పూరం అందరికితెలిసిన కర్పూరాలు.  కర్పూరంలో చాలారకాలున్నాయి. ఘనసారం, భీమసేనం, ఈశానం, ఉదయభాస్కరం, కమ్మకర్పూరం, ఘటికం, తురుదాహం, తుషారం, హిమరసం, హారతికర్పూరం, శుద్ధం, హిక్కరి, ప్రోతాశ్రయం, పోతాశం, సితాభ్రం, యీ కర్పూరరకాలు. కర్పూరంచెట్టు వేళ్ళు,కొమ్మలు, ఆకులు నీళ్ళలో మరిగించి డిస్టిలేషన్ పద్దతిలో సేకరించే కర్పూరాన్ని పచ్చకర్పూరమంటారు. దీన్ని ముఖ్యంగా లడ్డూలాంటి తీపిపదార్తాల్లోను  ఔషదాల్లోనూ, కాటుకలు, అంజనాలు తయారుచేయడానికి వాడుతారు. బీమసేనికర్పూరం, చెట్టుకొమ్మలకు గాట్లుపెట్టి, వాటినుండి స్రవించే పాలతో తయరుచేస్తారు. కనుక దీన్ని అపక్వకర్పూరం అనికూడా అంటారు. ఇది ఔషదాలలో ఎక్కువగా ఉపయోగిస్తారు. హారతికర్పూరం టర్‍పెంటైన్ నుండి రసాయనిక ప్రక్రియద్వరా తయారుచేస్తారు. ఇది కృత్రిమకర్పూరం. దీన్ని ఔషదాలలో వాడరు. రసకర్పూరమని మరొకటున్నది. దీన్ని ఆముదంతో కలిపి చిన్నపిల్లలకు కడుపులోనికిస్తారు. శరీరంలోని దోషాలన్నిటిని ఇది  పోగొట్టి దేహరక్షణ గావిస్తుంది.

 కర్పూరం, పూజానంతరం దేవునివద్ద మంగళహరతిపాటపాడి   హారతినివ్వడానికేగాకుండా, వాస్తుదోష పరిహారణకూ, దిష్టిదోష నివారణకు సైతం కర్పూరముపయోగపడుతుంది. ఇంట్లో కర్పూరం వెలిగించడంవల్ల మానవసంబంధాలు మెరుగుపడతాయి. అపార్థాలు తొలగిపోయి మానసిక‍ఆంధోళనలు శాంతించి, నకారాత్మకశక్తులు నశిస్తాయి. పడకగదిమూలలలో వెండిలేక ఇత్తడి గిన్నెలో కర్పూరంవేసి వుంచితే భార్యాభర్తల మధ్య గొడవలుపోయి సమన్వయం కుదురుతుంది. ఇంటి ఆగ్నేయంలో కర్పూరం నెయ్యి కలిపి సాయంత్రాలు దీపాలు వెలిగిస్తే, గ్రహదోషాలు తొలగి, చేపట్టినపనులు సక్రమంగా జరుగుతాయి. అదృష్టం వరిస్తుంది. కర్పూరంపొడి లవంగాలపొడి కలిపి వెలిగించి ఇల్లంతా త్రిప్పితే, ఇంటికిపట్టిన చీడలు, పీడలు, పిశాచాలు వదలిపోతాయి. ముఖ్యంగా యిలా దీపావళిరోజునచేస్తే మరింతమంచిది. అనారోగ్యంనుంచి కోలుకొని ఆసుపత్రినుండివచ్చి గృహప్రవేశం చేసేటప్పుడు పళ్ళెరంలో ఎఱ్ఱనీళ్ళుపోసి అందులోనే కర్పూరం వెలిగించి దిష్టితీసి,  ఎఱ్ఱనీళ్ళు వాకిలి రెండుపంచలా పారబోయాలి. ఇలాచేసి ఇంట్లోకి వెళితే దృష్టి దోషాలుపోయి, ఆయురారోగ్యాలు సమకూరుతాయి తొందరగా మాములు స్థితికివచ్చేస్తారు. కర్పూరంపొడి లావెండర్‍ఆయిల్‍తో కలిపి గానీ లేక మంచినీళ్ళలోకలిపిగానీ ఇల్లుశుభ్రంచేస్తే క్రిములు నశించి, ఇల్లు సువాసనలతో శుభకరంగా వుంటుంది.  

    వైద్యపరంగా కర్పూరపు ప్రయోజనాలు చాలాఎక్కువ. కర్పూరం ఎక్కువమోతాదులోకాకుండా కొద్దిమాత్రమే సేవించాలి. లేకపోతే దానిఘాటువల్ల ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదంవుంది. కర్పూరం సేవిస్తే స్వల్పహృదయసమస్యలు, అలసట తగ్గిస్తుంది. కీళ్ళనొప్పులు, నరాల నొప్పులు, బలహీనత, వీపు నడుంనొప్పులకు నూనెలో కర్పూరం కలిపి మర్థన చేయడంద్వారా ఉపశమనం కలుగుతుంది. అందుకే చాలారకాల నొప్పినివారణ ఆయింట్‍మెంట్లలో దీన్ని వాడుతున్నారు. పుండ్లుమానడానికి, పిల్లల్లోవచ్చే గజ్జి తామర నయంచేయడానికి కూడా యీనూనెను ఉపయోగిస్తారు. కుష్ఠురోగుల పుండ్లను కూడా యీనూనె మాన్పుతుంది. కర్పూరం వాసనచూస్తే నాశికాసమస్యలు, ఊపిరితిత్తులసమస్యలు తొలగిపోతాయి. రెండుపలుకుల కర్పూరం నోటిలోవుంచుకుంటే, దప్పిక తగ్గుతుంది. నోటిదుర్వాసనా తగ్గుతుంది. సారాయిలో కర్పూరం కలిపి సంతృప్త ద్రావణంగా తయారుచేసుకొని చితికెడుచెక్కెరలో రెండు చుక్కలు యీ ద్రావణం వేసుకొని సేవిస్తే, నీళ్ళవిరేచనాలు తగ్గుతాయి. కలరావ్యాప్తి సమయంలోకూడా దీన్ని నివారణమందుగా వాడుకోవచ్చు. కర్పూరసువాసన కామకోరికలను అదుపులోవుంచుతుంది. అంతేగాక పచ్చకర్పూరం, జాజికాయ, జాపత్రి, ఎండుద్రాక్ష సమభాగాలుగాతీసుకొని కలిపినూరి బఠాణీలంత మాత్రలు చేసుకొని రాత్రిపడుకోబోయే ముందు ఒకగ్లాసు పాలతో సేవిస్తే మగవారిలో లైంగికశక్తి పెరుగుతుంది. కర్పూరం రోజ్‍వాటర్‍తో కలిపి మర్మావయాలకు పట్టించి 15 నిముషాల తర్వాత కడిగేస్తే మర్మాయవాలదురదలు తగిపోతాయి. ఇలా రోజుకు రెండుసార్లు చేస్తే సరిపోతుంది. ఉబ్బసం తీవ్రంగావుంటే బెల్లం కర్పూరం సమపాళ్ళలోకలిపి కొద్దికొద్దిగా సేవిస్తే తీవ్రాత తగ్గుతుంది. నీళ్ళలో కాస్తా కర్పూరంపొడి చల్లి ఆనీళ్ళతో స్నానంచేస్తే శరీరంపైనుండే బ్యాక్టీరియా నశించి, చర్మంశుభ్రంగా వుంటుంది. కర్పూరంపొడిని కొబ్బరినూనెలో నానబెట్టి తలకుపట్టిస్తే చుండ్రు పోతుంది. ఉతికిన బట్టలమధ్య కాస్తా కర్పూరం వేసి పెడితే రిమటలు దరిదాపుల్లోకి రావు. కర్పూరం రెండుభాగాలు, వాముపువ్వు ఒకభాగం, మెంథాల్ (పెప్పరమెంటుపువ్వు) ఒకభాగం సీసాలోవేసేస్తే  అదే ద్రవమై పోతుంది. దీన్ని అమృతధార అంటారు. రెండుచుక్కలు అమృతధార చిటికెడుచెక్కెరలో వేసుకొని కడుపులోకి సేవిస్తే, ఆహారం సులభంగా జీర్ణమౌతుంది. దగ్గుతగ్గుతుంది. నీళ్ళవిరేచనాలు తగ్గిపోతాయి. తలనొప్పులకు, వాపులకు బెణికిననొప్పులకు, పైపూతగా బాగా పనిచేస్తుంది. ముక్కుపైన వీపుపైన మాటిమాటికి పట్టిస్తూవుంటే, జలుబు రొంప రొమ్ముపడిశం తొందరగా తగ్గుతుంది. కడుపుపైన రుద్దుతే, ఉబ్బరం తగిపోతుంది. దెబ్బతగిలినవెంటనే గాయంపైన దూదిపై నాలుగుచుక్కలు అమృతధార వేసి పెడితే రక్తంకారడం వెంటనే తగ్గిపోయి, తొందరగా పక్కుగట్టి మానిపోతుంది. చిటికెడుబీయ్యంలో కాస్త కర్పూరమేసి చేతిగుడ్డలో  ఒకకొసన మూటగాకట్టి జలుబు పడిశంలో ఇన్‍హేలర్‍గా వాడుకొనవచ్చు. ఇలా చాలా ఉపయోగాలున్నాయి కర్పూరంతో-       

 

పారాణి

  పారాణి పసుపులో సున్నపునీరు చిక్కగాకలుపుకుంటే పారాణి తయారౌతుంది. అదేనీళ్ళగా కలుపుకుంట...