Showing posts with label Ash gourd. Show all posts
Showing posts with label Ash gourd. Show all posts

Friday, 10 March 2023

గుమ్మడికాయ,కూష్మాండం,Ash gourd

 

        

      

బూడిద గుమ్మడికాయ



గుమ్మడికాయ రెండురకాలు. ఒకటి పసుపు ఎఱుపుకలిసినరంగులోనుండి కూరల్లో ఎక్కువగా వాడుకుంటారు. రెండవది బూడిదగుమ్మడికాయ. ఇది తెల్లటికాయ. పైన బూడిదపూసినట్లుంటుంది. సంస్కృతంలో గుమ్మడి కాయను  కూష్మాండం అంటారు. పుచ్చజాతిలోని ప్రత్యేకమైన కాయయిది. ఐదారు కిలోలవరకు బరువుంటుంది. దీన్ని కూరగాయగా గానేగాక వైద్యంలోనూ, దిష్టి నివారిణిగానూ ఉపయోగిస్తారు. నరదృష్టి తగిలితే నాపరాయైనా పగిలిపోతుందన్న సామెత వుండనేవుంది. అట్టి దృష్టిదోషనివారిణి యీ గుమ్మడికాయ. సాధారణంగా గృహప్రవేశంనాడు, కూష్మాండపూజ తెలిసిన పూజారిచేత కూష్మండపూజ చేయించి గుమ్మంముందు ఉట్టిగట్టి వ్రేలాడదీస్తారు. కార్యాలయాలకు, వ్యాపారసంస్థలకు సహితం దిష్టిదోషం పోవడానికి గుమ్మడికాయ కట్టుకుంటారు. మనపైన, మనయింటిపైన దిష్టిదోషం వుంటే, ఆదోషాన్ని గుమ్మడికాయ తనవైపుకు లాక్కొని అది చెడిపోతుంది. లేదా సూతకదోషం, అంటే, ఇంట్లో ఆడపిల్ల పుష్పవతి అయినప్పుడు, ఇంట్లో ఎవరైనా చనిపోయినప్పుడు, మైలపడినప్పుడు, లేదా గ్రహణప్రభావం సోకినపుడు గుమ్మడికాయ చెడిపోవచ్చు. లేకుంటే గుమ్మడికాయ సంవత్సరకాలం చెడిపోకుండావుంటుంది. దీన్ని యితరకూరగాయల వలె  ప్రిజ్‍లో పెట్టనవసరంలేదు. సూతకం రోజుల్లో సూతకం పోయినతరువాత కాయ మార్చుకోవాలి. ఏకారణంతో కాయచెడిపోయినా వీలైనంత తొందరగా కాయమార్చుకోవాలి. ఒకరోజుముందే గుమ్మడికాయతెచ్చి ఇంట్లో వుంచుకొని, మరునాడు సూర్యోదయసమయంలో కాయకు పసుపుకుంకుమలు రాసి, ధూపంగానీ అగరువత్తులుగానీ వెలిగించి, పూజచేసి మళ్ళీ కాయను ఉట్టిలో వుంచుకోవాలి. చెడిపోయినకాయను నదిలో విడిచిపెట్టాలి. గుమ్మడికాయ కట్టుకోవడానికి  ఆది, గురువారాలు మంచివి. కారణం ఆరోజులకు భూతప్రేత పిశాచాలను తరిమివేసే గుణంవుంది. ఇంట్లో పూజచేసినప్పుడల్లా అగరువత్తులు గుమ్మడికాయ వద్దకూడా వెలిగించాలి. ఇలాచేస్తే నకారాత్మకశక్తులు ఇంట్లోకి రాలేవు. గుమ్మడికాయపైనుండివీచేగాలి ఇల్లంతా వ్యాపిస్తే, గుమ్మడిలోవుండే ప్రాణశక్తివల్ల ఇంట్లోనివారందరూ క్షేమంగా వుంటారు. గుమ్మడికాయ లోలోపలికి ముడుచుకపోయి, ఓసంవత్సరానికి మామూలుగా ఎండిపోతుంది. కనుక అది మంచిపరిణామమే. అందువల్ల ఏడాదికోసారి గుమ్మడికాయ మార్చుకోవడం మంచిది. గృహప్రవేశంరోజున కొందరు బలియిస్తుంటారు. అది అహింసా వాదులకు నచ్చదు. వారు గుమ్మడికాయకు రంధ్రంవేసి దానిద్వార ఎఱ్ఱటి కుంకుమ లోపలికి పోనిచ్చి, ఆగుమ్మడికాయను పగులగొడతారు. ఇది నూరు మేకపోతుల బలితో సమానమని శాస్త్రం చెబుతున్నది. బాడుగింట్లో వున్నవారు సైతం గుమ్మడి కాయ ఇంటిగుమ్మానికి కట్టుకోవచ్చును. ఎఱ్ఱగుమ్మడి చరకిదేవతా, బూడిదగుమ్మడికాయ విదారిదేవతానివాసం. ఈదేవతలు కష్టనష్టాలను పిశాచాలను తొలగించి మేలుచేకూరుస్తారు. కొందరు గుమ్మడికాయను కాలభైరవుడనికూడా దోషనివృత్తికోసం పూజిస్తారు. తెలిసినపండితులు సమయానికి దొరకని పక్షంలో "హే కూష్మాండదేవతా ఇయంగృహే శాకిన్యాదిదేవాః పరతంత్రాది సర్వదోషాన్ నివృత్తయ నివృత్తయ గృహే సర్వకార్యాదిన్ రక్ష రక్ష హోంఫట్ స్వాహా" అని మూడుసార్లు జపించి ఇంటివారే కట్టుకొనవచ్చును. దుర్గాష్టమినాడు (దశరాలో) శాకాహారులు దేవత ముందు జంతుబలికిమారుగా గుమ్మడికాయకుబెజ్జంవేసి అందులో ఎఱ్ఱటికుంకుమపోసి కూష్మాండం పగులగొట్టి దేవీఅనుగ్రహానికి పాత్రులౌతారు.

 

వంటలో రెండురకాల గుమ్మడికాయల ఉపయోగమూ ఎక్కువే. గుమ్మడికాయ మేద్జోశక్తిపెంచుతుంది. ఔషదరూపంలో మాత్రం బూడిదగుమ్మడినే ఉపయోగిస్తారు. ఈగుమ్మడి పచ్చితురుమును పెరుగులోవేసుకొని సేవిస్తే శరీరంలోని వేడిని తగ్గిస్తుంది. మొలలవ్యాధిని నివారిస్తుంది. గింజలతో పోస్త్రేటు సమస్యలు నయమవుతాయి. గ్రుడ్లువాడమనేవారికోసం, గుమ్మడితురుమువాడి పాన్‍కేకులు తయారుచేస్తున్నారు. గుమ్మడివడియాలు అందరికీ తెలిసినవే. ఆగ్రాపేడా అని పిలుచుకొనే మిఠాయిలో ఎక్కువగా బూడిదగుమ్మడితురుమునే వాడతారు. పండుగరోజుల్లో బూడిదగుమ్మడిహల్వా చేసుకొంటాము. సాంబారులో గుమ్మడిముక్కలు వేసుకుంటాము. పైచెక్కుతీసి ముక్కలుముక్కలుగాతరిగి మిక్సీలోవేసి బూడిద గుమ్మడిరసం తీసుకొని అందులో కొద్దిగా సైంధలవణం మరియు నిమ్మరసం కలిపి, ఆరసం త్రాగడంవల్ల శరీరవేడి తగ్గుతుంది. ఆంటీయిన్‍ఫ్లమేటరీగా పనిచేస్తుంది. మబద్దకం తొలగి పోతుంది. కడుపులోమంట, ఉబ్బరం, అధికదాహం, ఉదరకోశవ్యాధులెన్నో బాగౌతాయి. కడుపులో పురుగులు నశిస్తాయి. మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడవు. కంటిచూపు పెరుగుతుంది. గుమ్మడికాయలో పీచుపదార్తం, పొటాషియం, ఇనుము వుండి రక్తపోటును తగ్గించి రక్తహీనతను పోగొట్టి రక్తంలో చెక్కరను నియంత్రిస్తుంది. సంతానసాఫల్యతకుకూడా తోడ్పడుతుంది. గింజలల్లో సూక్ష్మపోశకాలున్నాయి. వీటినివేయించి తినవచ్చును.  ఇవి హార్మోన్లను సమతుల్యంగా వుంచుతాయి. బూడిదగుమ్మడికాయలో 99% నీరేవుంటుంది. అందువల్ల కార్బోహైడ్రేట్లు క్రొవ్వులు అతితక్కువగావుంటాయి. డైటించేసి బరువుతగ్గాలనేవారికి గుమ్మడితోచేసిన ఆహారాలు, జూసులు చాలామంచివి. గుమ్మడితీగరసం రక్తపోటుకు, నిద్రలేమికి మంచిమందుగా పనిచేస్తుంది. చెడుక్రొవ్వును చేరనివ్వదు. విత్తనాలనూనె చర్మవ్యాధులను మాన్పుతుంది. కాయపైచెక్క, గింజలు కొబ్బరినూనెలో వేసికాచుకొని తలనూనెగా ఉపయోగించవచ్చును. ఈనూనె వెంట్రుకలు బాగాపెరగడానికి తోడ్పడుతుంది. సిద్ధవైద్యంలోనూ ఆయుర్వేదవైద్యంలోనూ బూడిదగుమ్మడితో ఔషదాలు తయారుచేస్తారు. ఆయుర్వేదంలో కూష్మాండలేహ్యం పేరుకెక్కినది. ఇదిమంచిపుష్టినిస్తుంది. క్షయ, రక్తహీనతలలో మంచిగుణకారి. కేరళవైద్యంలోకూడా కూష్మాండరసాయనం పేరుతో బలవర్ధకరఔషదం తయారుచేస్తున్నారు. గుమ్మడికాయలో విటమిన్ ఏ, బి6, సి, , మెగ్నీషియం, ఇనుము, భాస్వరం, ఫ్లోలేట్, నియాసిన్, థయామిన్. కెరొటిన్, ల్యూటేయిన్, జియాక్యాంథిన్ వంటి పోషకాలున్నందున ఆరోగ్యదాయినిగా గుర్తింపుపొందింది.                

      

పారాణి

  పారాణి పసుపులో సున్నపునీరు చిక్కగాకలుపుకుంటే పారాణి తయారౌతుంది. అదేనీళ్ళగా కలుపుకుంట...