తాంబూలం
హిందూకుటుంబాలలో తాంబూలంలేకుండా యేశుభకార్యమూ జరుగదు. వ్రతాలకుగానీ, పూజలకుగానీ, పెండ్లికిగానీ మరేయితరశుభకార్యాలకేగానీ తాంబూలమిచ్చిపిలవడం ఒకసదాచారం. పూజలో భగవంతునికీ తాంబూలంసమర్పించడం తప్పనిసరి. పెద్దలకు తాంబూలమిచ్చి ఆశీర్వాదంతీసుకోవాలి. ఆఖరుకు సాగనంపేటప్పుడుకూడా తాంబూలమిచ్చి పంపాలి. ఒకశుభకార్యం పురమాయించేటప్పుడూ తాంబూలమిచ్చి పనిఅప్పజెప్పాలి. ఒకకావ్యం అంకితం తీసుకోవాలంటే కవికి తాంబూలమిచ్చి కానుకలివ్వాలి. ఒకపెళ్ళిసంబంధం కుదిరితే నిశ్చితార్థం చేస్తారు. అందులో నిశ్చయతాంబూలమియ్యడమే అతిముఖ్యం. రెండువైపులవారూ తాంబూలాలుమార్చుకుంటేనే సంబంధం కుదిరినట్లు. తాంబూలంతోపాటు, పుష్పాలు, పండ్లు, క్రొత్తబట్టలుకూడా యిస్తారు. కానీ ఏమున్నాలేకున్నా, తంబూలాలుమాత్రం తప్పనిసరి. గురజాడాప్పారావుగారి కన్యాశుల్కం నాటకములో అగ్నిహోత్రావధానులు ఒకముసలానకు తనకూతురునిచ్చిపెండ్లిచేయడానికి నిశ్చితార్థంచేసుకొని వస్తాడు. భార్యా బావమరదులు మేమొప్పుకోమంటారు. అప్పుడు అగ్నిహోత్రావధానులు "తాంబూలాలిచ్చేశాను తన్నుకచావండి" అంటాడు. అంటే తాంబూలమిచ్చి మాటచెబితే యికదానికి తిరుగేలేదన్నమాట. ఇక పెండ్లిలో తాంబూలప్రశస్తి వేరుగాచెప్పవలసిన పనిలేదు. వధూవరులకలయిక ఆకూవక్కావలె విడదీయరానిదై వుండాలన్నది ఆర్యవాక్యం.
తాంబూలం
భగవంతునకు పూజలోసమర్పిచడం,
శతపత్ర(శతదళకమల)ములతో పూజించడంతో సమానమేగాక, సర్వదోషహరమని
భావిస్తారు. కొన్ని పూజల్లో కలశస్థాపనచేస్తారు. పాత్ర(చెంబు) లో మంచినీరుపోసి,
తమలపాకుతొడిమలు నీటినితాకునట్లు చుట్టూవుంచి పైన
కొబ్బరికాయవుంచుతారు. ఆకులతొడిమలకు నీళ్ళుతగులుతుంటేచాలు ఆకులువాడిపోకుండా పచ్చగా
కళకళలాడుతూవుంటాయి. ఇట్టి కలశంలోనికి ఇష్టదేవతనావాహనచేసి పూజిస్తారు. ఈవిధంగా
తమలపాకులు, తాంబూలం శుభకార్యాలన్నింటిలో అగ్రస్థానం
వహిస్తున్నాయి. అంతెందుకూ ఒకవ్యక్తిని మహోన్నతునిగా నిర్ణయించినందుకు గుర్తుగా
అతనికి అగ్ర(తొలి)తాంబూలం ఇచ్చి గౌరవించాలి. రాజసూయయాగ చరమాంకంలో శ్రీకృష్ణుడు
మహోత్తముడని గుర్తించి అగ్రతంబూలమిచ్చి గౌరవించించాడు ధర్మరాజు.
2. వృషభరాశివారు తాంబూలంలో మిరియాలులుంచి మంగళవారం రాహువుపూజ చేయాలి.
3. మిథునరాశివారు తాంబూలంలో అరటిపండ్లుంచి బుధవారం ఇష్టదైవాన్ని పూజించాలి.
4. కర్కాటకరాశివారు తాంబూలంలో దానిమ్మపండ్లుంచి శుక్రవారం కాళీమాతను
పూజించాలి.
5. సింహరాశివారు తాంబూలంలో అరటిపండ్లుంచి గురువారంనాడు ఇష్టదైవాన్ని
పూజించాలి.
6. కన్యారాశివారు తాంబూలంలో మిరియాలుంచి గురువారం ఇష్టదైవాన్ని పూజించాలి.
7. తులరాశివారు తాంబూలంలో లవంగాలుంచి శుక్రవారం ఇష్టదైవాన్ని పూజించాలి.
8. వృశ్చికరాశివారు తాంబూలంలో ఖర్జూరపుపండ్లుంచి మంగళవారం ఇష్టదైవాన్ని
పూజించాలి.
9. ధనుర్రాశివారు తాబూలంలో కలకండనుంచి గురువారం ఇష్టదైవాన్ని పూజించాలి.
10. మకరరాశివారు తాంబూలలో బెల్లముంచి శనివారం కాళీమాతను పూజించాలి.
11. కుంభరాశివారు తాంబూలంలో నెయ్యివేసి శనివారం కాళీమాతను పూజించాలి.
12. మీనరాశివారు తంబూలంలో పంచదారనుంచి ఆదివారం ఇష్టదైవాన్ని పూజించాలి.
ఇదీ
పూజకు,
శుభకార్యాలకు సంబంధించిన తాంబూలవిషయం.
చూర్ణాధిక్యంతు మధ్యమం
వర్ణాధిక్యం భవే ద్రా
త్రౌ
తాంబూలమితి లక్షణం---బావప్రకాశిక.
విమతులతో జెలిమిజేసి
వెతఁబడు తెలివిన్
గమలములు లేని కొలకును
హిమధాముడులేని రాత్రి హీనము
సుమతీ.
ప్పుర విడె, మాత్మ కింపయిన భోజన, మూయల మంచ, మొప్పు త
ప్పరయు రసజ్ఞు, లూహ తెలియంగల లేఖక పాఠకోత్తముల్,
దొరకిన కాక, యూరక కృతుల్ రచియింపుమటన్న శక్యమే .
తుమ్మజాతి
చెట్టు బెరడునుండి తయారు చేస్తారు) ఏలకలు లవంగాలు, జాజికాయ, జాపత్రి, మెంథాల్,
కొబ్బరితురుము గుల్కంద్ వంటి వస్తువులు ఎవరియిష్టానుసారం వాళ్ళు వేయించుకొని
సేవిస్తారు. పెండ్లితర్వాత కొత్తపెండ్లాము భర్తకు ముద్దుముద్దుగా చిలుకలుచుట్టి
భర్తనోటికందిస్తుంది. చిలుకలంటే యిక్కడ చేతివేళ్ళకు చుట్టుకున్న
తమలపాకులన్నమాట. ఇక వేశ్యాగృహాలలో యీ చిలుకల వినియోగం ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. తాబూలానికివాడే తమలపాకులుకూడా
చాలారకాలే వున్నాయి. తెల్లాకు, కారపాకు(బనారసి), కలకత్తాపత్తా, కుభకోణంఆకు,
వెల్లారి, కలిజేడు వంటివెన్నోవున్నాయి.
తాంబూలాన్ని విడెమని, బీడాయని, కిల్లీయనికూడాపిలుస్తారు. వీటిని ప్రత్యేకంగా తయారుచేయగల
నేర్పరులున్నారు. వారు తంబూలాన్ని ఒక వ్యాపారవస్తువుగా చేసుకొని
అమ్ముకొనుచున్నారు. పట్టణాలలో భోజనహోటళ్ళదగ్గర భోజనానంతరం వేసుకోవడానికి
వీలుగా అమ్ముతుంటారు. వీటిలో జర్దాలు, పొగాకువంటివి
కలిపిచేసే బీడాలు కూడా దొరుకుతాయి. వీటికి అలవాటుపడి ఆరోగ్యం
చెడగొట్టుకుంటున్న వాళ్ళూ వున్నారు.