Tuesday, 14 March 2023

పటిక,Allum

 పటిక


పటిక స్ఫటికాకారంలో వుండే పారదర్శకమైన ఉప్పువంటి ఖనిజం. దీన్ని పటికారం అనికూడ అంటారు. నీళ్ళలో పటికపొడి చల్లడంవలన, పటిక నీటిలోని మురికిని గ్రహించి, నీటిఅడుగుకు చేరిపోతుంది. మంచితేటనీరు పైనవుంటుంది. కనుక త్రాగునీరు సరఫరాసమయంలో  ప్రభుత్వము ట్యాంకుల్లో పటికను వాడతారు. ఏటిగట్టుపల్లెల్లో చెలిమెలలోకూడా దీన్నివాడుకుంటారు. పటికకుబదులు, చిల్లగింజలు అరగదీసి ఆగంధం నీటిచెలిమెల్లో వాడుకుంటారు.

 పటికరాయిని నల్లవెంట్రుకల తాడుతోగాని, ఎఱ్ఱలేక నల్లగుడ్డలో కట్టి దుకాణాలగుమ్మాలలోను కొన్నియిళ్ళ తలవాకిటికి, నూతనవాహనాలకు ముందువైపు యీ పటికను కట్టివుండటం గమనిస్తుంటాము. కారణం యీ పటికవున్న చోటికి నకారాత్మకశక్తులు ప్రవేసింపలేవని వాస్తుశాస్త్రజ్ఞులు చెబుతుంటారు, వాస్తుదోషంవుండి, దాన్ని సరిదిద్దలేని పరిస్థితుల్లో యీ పటిక కట్టుకుంటే, వున్న వాస్తుదోషం, దిష్టిదోషం కూడా తొలగిపోతుందని నమ్ముతారు. ప్రతిగదిలో ఉత్తరందిక్కున ఒక చిన్నగాజుగ్లాసులో పటికవేసిపెట్టినా, దేవునిగూట్లో ఒకచిన్న గాజుగిన్నెలో పటికపలుకులు వేసివుంచినా, ఇంటి ద్వారబంధానికి పటికరాయి ఎఱ్ఱగుడ్డలో మూటగట్టి ద్వారబంధానికి కట్టుకున్నా ఆఇల్లు సుఖసంతోషాలతో సమృద్ధితో కళకళలడుతూ వుంటుందని, అది లక్ష్మీనివాసమౌతుందని అనేకుల ప్రగాడ విశ్వాసం. పటికనీటితో అప్పుడప్పుడు ఇల్లుగాని, కార్యాలయంగాని, వ్యాపారస్థలంగాని శుభ్రంచేసినా శుభాలు వెల్లివిరుస్తాయంటారు. ఇందువల్ల క్రిమినివారణకూడా జరుగుతుంది. ఇలాగే దిష్టిదోషంపోవడానికి నిమ్మకాయలు మిరపకాయలు ఒకకడ్డీకిగాని, దారానికిగాని గ్రుచ్చి, దిష్టిదోషనివారణకు కట్టుకోవడం మనం అనేకచోట్ల చూస్తూవుంటాం. ఇదికొందరు మూఢనమ్మక మనుకోవచ్చుగానీ, నిమ్మకాయలు మిరపకాయలూ కలిపి కట్టడంద్వారా వాటికలయికతో రసాయనికచర్య జరిగి, అందుండి వెలువడే వాయువు ఆరోగ్య ప్రదాయినియని శాస్త్రజ్ఞులు చెప్పడం గమనార్హం. పటికపైనుండి వీచేగాలికూడా ఆరోగ్యప్రదాయినియే. అయినా పటిక మాటిమాటికి మార్చవలసిన అవసరంవుండదు. మిరప కాయలు నిమ్మకాయలు పచ్చివిగనుక ఎండిపోతాయి. అందువల్ల వారానికొకసారైనా మార్చుకోవలసివస్తుంది.

 పటిక ఆయుర్వేదం, హోమియోపతి వైద్యంలో ఉపయోగిస్తున్నారు. స్ఫటికాదిచూర్ణం పేర ఆయుర్వేదంలో ఒకమందు దొరుకుతుంది. అది పంటిచిగుళ్ళనుండి రక్తంరావటం, నాలుకపైపుండ్లకూ బాగా పనిచేస్తుంది. టాన్సిల్స్ వాపు నొప్పి తగ్గుతాయి. 15  గ్రాముల పటిక, 600 మిల్లీలీటర్ల నీటితోకలిపిన ద్రవంలో రెండు శుభ్రమైన గుడ్డలుతడిపి ఒకదానొతో యోనిని శుభ్రపరచి రెండవది యోనిలో   కొద్దిసేపుంచాలి.  ఇలా కొద్దిరోజులు చేస్తే తెల్లబట్ట, యోనివ్రణాలు, దురదలు తగ్గిపోతాయి. పటికనీటిని రెండుచుక్కలు కళ్ళలోవేస్తే, కలకలు నయమౌతాయి. నిప్పులపై పెంకుపెట్టి దానిపై పటికవేసి పేల్చాలి, చల్లారినతర్వాత చనుబాలు కలిపి చెవిలోవేస్తే చవిలోని గుల్లలు మాని, చీముకారడం తగ్గిపోతుంది. పటికకలిపిన నీటితో మొలలను కడగడంద్వారా మొలలపిలకలు ఎండిపోయి రాలిపోతాయి. 200గ్రాముల ముల్లంగిరసం 10 గ్రాముల పటికపొడికలిపి సన్ననిమంటపై ముద్దకట్టేవరకు వండి, రేగుపండంత మాత్రలు చేసుకొని ఆరనిచ్చి, రోజూఉదయం ఒకమాత్ర చొప్పున సేవిస్తే మొలలవ్యాధిలో నొప్పి, దురద, రక్తంకారడం తగ్గిపోతాయి. ఇదే మాత్ర మూత్రపిండాలలో నొప్పినికూడా నయంచేస్తుది. ఐదుగ్రాముల పటికపొడి 100 మిల్లీలీటర్ల పాలలోవేసి వడగట్టి రోజూ మూడుపూటలా త్రాగితే నోరు, ముక్కు, మలమూత్ర ద్వారాలనుండి రక్తంస్రవించడం, రక్తవిరేచనాలు, స్త్రీలలో బహిష్టు వ్యాధులు నయమౌతాయి. పటిక హారతికర్పూరం దానిమ్మపెచ్చులు నీటితోనూరి రాత్రి రొమ్ములకు పట్టించి బట్టకట్టుకొని ఉదయం కడిగేస్తూవుంటే, స్తనాలు దృడత్వం సంతరించుకుంటాయి. పటిక కోడిగ్రుడ్డుపచ్చసొన కలిపి పట్టిస్తే పడకపుండ్లు మానిపోతాయి. పొంగించిన పటికపొడికి పదిరెట్లు బెల్లంకలిపి రోజూ ఒకటిరెండుసార్లు సేవిస్తే మొండిదగ్గులు తగ్గిపోతాయి. 200 గ్రాముల కొబ్బరినూనె, 50 గ్రాముల తేనెమైనం కలిపి వేడిచేసి గోరువెచ్చగానున్నప్పుడు 30 గ్రాముల పటికపొడి కలిపి వుంచుకొని, తారాగుండంత ఉదయం సాయంత్రం సేవిస్తే ప్రేగుల్లోపూత, వ్రణాలు, నోటిపూత బాగౌతాయి. పటికపొడి బొగ్గుపొడికలిపి పళ్ళుతోముకుంటే పంటిజబ్బులురావు. నోరుబాగా శుభ్రమౌతుంది నోటిడుర్వాసన తగ్గిపోతుంది . పటికపొడి కొద్దిగా నీళ్ళలోకలిపి స్నానాంచేస్తే ఎక్కువగా చెమటలుపట్టడం తగ్గిపోతుంది. తలస్నానంచేస్తే పేలుపడవు. గాయాలు పటికనీటితో కడిగితే క్రిమిసంహారినిగా పనిచేసి రక్తస్రావం తగ్గి, తొందరగా గాయాలుమాని పోతాయి. మంగలిషాపుల్లో షేవింగ్ తర్వాత నీళ్ళతోతడిపి పటికబిళ్ళతో రుద్దుతారు. అందువల్ల చర్మవ్యాధులు వ్యాపించవు. ముఖంపై గుల్లలు నయమౌతాయి. వాపులు, తిమ్మెర్లు, మంటలువున్న శరీరభాగాలపై నీళ్ళుజల్లి పటికతో రుద్దితే, ఉపశమనంకలుగుతుంది. పటికనీటితో ముఖంకడుక్కొనే అలవాటుచేసుకుంటే, ముఖంపై ముడుతలు తొందరగాపడవు. అవాంచిత రోమాలు మొలవవు. మొటిమలురావు. వచ్చినతర్వాత పటికనీటితో ముఖంకడుక్కుంటూవుంటే, తొందరగా పోతాయి. మచ్చలుయేర్పడవు. కరోనావంటివైరస్ వ్యాధులు ప్రబలినపుడు శానిటైజర్లకు బదులు పటికనీటితోచేతులు కడుక్కోవచ్చు. ఇదిచౌక. రెండుపలుకులు జోబులో వేసుకుంటేకూడా మంచిదే. బియ్యంలో పురుగులు పడకుండా పటిక పలుకులు కలుపుకుంటే సరిపోతుంది. వండుకునేప్పుడు యీపలుకులు తీసేసుకోవచ్చు. ఒకటిఅర బియ్యంలోవున్నా కడిగేప్పుడు నీటిలో కరిగిపోతాయి. ఇన్ని ప్రయోజనాలున్నాయి మరి పటికతో

పారాణి

  పారాణి పసుపులో సున్నపునీరు చిక్కగాకలుపుకుంటే పారాణి తయారౌతుంది. అదేనీళ్ళగా కలుపుకుంట...